India vs Afghanistan: ఈ ఏడాది టీమ్ ఇండియా చాలా బిజీ షెడ్యూల్ను కలిగి ఉంది. వెస్టిండీస్తో సిరీస్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆడనుంది. టీం ఇండియా ఆస్ట్రేలియాతో కూడా పోటీపడనుంది. ఆ తర్వాత ఆసియా కప్, 2023 ప్రపంచకప్ లో ఆడనుంది. ఆ తర్వాత భారత జట్టు ఆఫ్ఘనిస్థాన్తో సిరీస్ ఆడనుంది. ఒక నివేదిక ప్రకారం.. జనవరి 2024లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ (India vs Afghanistan) మధ్య సిరీస్ జరగనుంది. అఫ్గానిస్థాన్ సిరీస్తో పాటు మీడియా హక్కులపై కూడా బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు.
పిటిఐ వార్తల ప్రకారం.. క్రికెట్ మ్యాచ్ల మీడియా హక్కులను ఆగస్టు చివరి నాటికి నిర్ణయిస్తామని, ఇందులో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కూడా ఉంటుందని జై షా శుక్రవారం తెలిపారు. ప్రపంచ కప్ (సెప్టెంబర్)కి ముందు ఆస్ట్రేలియాతో భారత్ మూడు ODIలు ఆడుతుంది. ఈ మెగా ఈవెంట్ తర్వాత వారితో ఐదు T20 ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. కొత్త మీడియా హక్కుల ఒప్పందం ఆస్ట్రేలియా వన్డే సిరీస్ తో ప్రారంభమవుతుంది. మునుపటి మీడియా హక్కులు 2018 నుండి 2023 వరకు ఉన్నాయి.
Also Read: 200 Wickets: టెస్ట్ కెరీర్లో 200 వికెట్లు పూర్తి చేసిన మొయిన్ అలీ
జనవరిలో ఆఫ్ఘనిస్థాన్తో సిరీస్ జరుగుతుందని షా చెప్పారు. అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు జరిగే ప్రపంచ కప్కు ముందు ఇది జరగదని చెప్పారు. హాంగ్జౌ ఆసియా క్రీడలకు భారత పురుషులు, మహిళల జట్టు పంపనున్నట్లు తెలిపారు. ఏ టీమ్, బీ టీమ్ అనే తేడా ఉండదని చెప్పారు. ఆసియా క్రీడల్లో పాల్గొంటాం. అపెక్స్ కౌన్సిల్ మా పురుషుల, మహిళల జట్ల భాగస్వామ్యాన్ని ఆమోదించిందన్నారు.
ప్రపంచ కప్ 2023 ఈసారి భారతదేశంలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి బీసీసీఐ సన్నాహాలు ప్రారంభించింది. బోర్డు అనేక స్టేడియాలను అప్గ్రేడ్ చేస్తోంది. ఇందులో లక్నో, కోల్కతా, ముంబై వంటి అనేక నగరాల్లోని స్టేడియాలు ఉన్నాయి. ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్లో జరగనుంది.