Site icon HashtagU Telugu

Jasprit Bumrah: ఇంగ్లాండ్‌తో తొలి 2 వన్డే మ్యాచ్‌లకు బుమ్రా దూరం, కార‌ణ‌మిదే?

Jasprit Bumrah

Jasprit Bumrah

Jasprit Bumrah: ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ నాగ్‌పూర్‌లో జరగనుంది. దీని కోసం టీమ్ ఇండియా తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ఈ సిరీస్‌లో ఆడబోతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు టీమ్ ఇండియాకు ఈ వన్డే సిరీస్ చాలా కీలకం కానుంది. ఈ సిరీస్‌లో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహాలను పరీక్షించే అవకాశాన్ని పొందబోతోంది. ఇలాంటి సమయంలో ఈ సిరీస్‌లోని మొదటి 2 వన్డే మ్యాచ్‌లకు టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం కానున్నాడు.

తొలి 2 వన్డేల నుంచి జస్ప్రీత్ బుమ్రా ఔట్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గాయపడ్డాడు. సిడ్నీ టెస్టులో బుమ్రా మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. వెన్ను నొప్పి కారణంగా సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేయలేకపోయాడు. ఇదే సమయంలో బుమ్రా ఇప్పుడు స్కాన్, ప‌రీక్ష‌ల‌ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)కి చేరుకున్నాడు.

Also Read: TVS Jupiter CNG: TVS జూపిటర్ సీఎన్‌జీ ఈ నెలలో లాంచ్.. ధ‌ర ఇదేనా?

బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో బుమ్రాకు వైద్య‌ పరీక్షలు నిర్వహించనున్నారు. బుమ్రా గురించి టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల నుండి జస్ప్రీత్ దూరం కాబోతున్నాడు. అయితే ఇంగ్లాండ్‌ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా టీమ్ ఇండియా జట్టులోకి ఎంపికయ్యాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా కీలక పాత్ర పోషించనున్నాడు

జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియాలో ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో బుమ్రా టీమ్ ఇండియాకు ముఖ్యమైన బౌల‌ర్‌గా మారనున్నాడు. బుమ్రా ఇటీవలి ఫామ్ కూడా అద్భుతంగా ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 32 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా కూడా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉండాలని కోట్లాది మంది భారత అభిమానులు కూడా కోరుకుంటున్నారు.