IPL 2022 Finals: ఐపీఎల్ ఫైనల్ ఎక్కడో తెలుసా ?

ఐపీఎల్‌ 2021వ సీజన్‌ హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే సీజన్‌లో 48 మ్యాచ్‌లు పూర్తవ్వగా.. మరో 22 లీగ్‌ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - May 3, 2022 / 09:41 PM IST

ఐపీఎల్‌ 2021వ సీజన్‌ హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటికే సీజన్‌లో 48 మ్యాచ్‌లు పూర్తవ్వగా.. మరో 22 లీగ్‌ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజాగా ప్లే ఆఫ్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌ జరగబోయే వేదికలను ఖరారు చేసింది. కోల్ కత్తా, అహ్మదాబాద్ లో ప్లే ఆఫ్స్‌ మ్యాచ్ లను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే ఈ సీజన్ మెగా ఫైనల్ కు మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇక భారీ అంచనా మధ్య జరగనున్న ఐపీఎల్ 15వ సీజన్ ప్లే ఆఫ్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు పూర్తిస్థాయిలో ఫ్యాన్స్ కు అనుమతివ్వనున్నట్లు స్పష్టం చేసింది. దింతో రెండేళ్ల విరామం తర్వాత 100 శాతం కెపాసిటీతో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. అంతకుముందు ఫిబ్రవరిలో వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ కు కోల్ కతా, అహ్మదాబాద్ ఆతిథ్యమిచ్చాయి. కోల్ కతాలో జరిగిన మ్యాచులకు 75 శాతం కెపాసిటితో ఫ్యాన్స్ ను అనుమతించగా.. అహ్మదాబాద్ లో మాత్రం అభిమానుల్ని అనుమతించలేదు. ఇక మహిళల టి20 చాలెంజర్స్‌పై కూడా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మే 24 నుంచి 28 మధ్య పుణె వేదికగా మూడు జట్లతో మహిళల టీ ట్వంటీ చాలెంజర్స్‌ టోర్నీ నిర్వహిస్తామని ప్రకటించింది.

ఇక ఇప్పటివరకు ఐపీఎల్‌ 2022 పాయింట్ల పట్టిక లో టైటాన్స్‌, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ ,ఎస్‌ఆర్‌హెచ్‌ జట్లు తొలి నాలుగు స్థానాల్లో నిలవగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి.. అలాగే కేకేఆర్‌, పంజాబ్‌ కింగ్స్ జట్లు .. ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలువగా.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తొమ్మిది, పది స్థానాల్లో నిలిచాయి.