Five Players: ఈ ఐదుగురు ఆటగాళ్ళ కెరీర్ ముగిసినట్లేనా..?

టీమ్ ఇండియా జట్టులో చాలా మార్పులు కనిపించాయి. ఈ మూడు స్క్వాడ్‌లను చూసిన తర్వాత కొంతమంది ఆటగాళ్ల (Five Players) కెరీర్‌కు బ్రేక్‌ పడినట్లే అని తెలుస్తుంది.

  • Written By:
  • Updated On - December 1, 2023 / 10:28 AM IST

Five Players: డిసెంబర్ 10 నుంచి దక్షిణాఫ్రికాతో భారత జట్టు తన పర్యటనను ప్రారంభించనుంది. ఈ టూర్‌లో టీమిండియా మూడు టీ20, వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మూడు సిరీస్‌ల కోసం టీమిండియాను గురువారం ప్రకటించారు. టీమ్ ఇండియా జట్టులో చాలా మార్పులు కనిపించాయి. ఈ మూడు స్క్వాడ్‌లను చూసిన తర్వాత కొంతమంది ఆటగాళ్ల (Five Players) కెరీర్‌కు బ్రేక్‌ పడినట్లే అని తెలుస్తుంది.

టీమ్ ఇండియాకు ముగ్గురు కొత్త కెప్టెన్లు

భారత జట్టు ఈ పర్యటన కోసం మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేసింది. ముందుగా టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమ్ ఇండియాకు కెప్టెన్ గా కనిపించనున్నాడు. ఆ తర్వాత వన్డే జట్టు పగ్గాలు కేఎల్ రాహుల్ చేతుల్లోకి రానున్నాయి. ఇక చివరిగా రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ మూడు జట్లలో చోటు దక్కించుకోని ఆటగాళ్లు కూడా ఉన్నారు. దీని తరువాత ఈ ఆటగాళ్ల కెరీర్ ఆగిపోయిందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ ఐదుగురు ఆటగాళ్ళు ఎవరో తెలుసుకుందాం..!

అజింక్య రహానే

అజింక్య రహానే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అయితే ఇప్పుడు దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపిక కాలేదు. దీని తర్వాత ఈ ఆటగాడు టీమ్ ఇండియాకు తిరిగి రాలేడనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

చెతేశ్వర్ పుజారా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో నిరాశపరిచిన చెతేశ్వర్ పుజారా జట్టు నుండి తొలగించబడ్డాడు. ఆ తర్వాత వెస్టిండీస్‌ సిరీస్‌లో కూడా అతనికి చోటు దక్కలేదు. ఇప్పుడు దక్షిణాఫ్రికా టూర్‌కు కూడా ఎంపిక కాలేదు. దీని తర్వాత అతని కెరీర్‌కు కూడా బ్రేక్‌ పడినట్లు తెలుస్తోంది.

Also Read: Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా జట్టు ఎంపిక.. వన్డే, టీ20లకు రోహిత్, విరాట్ దూరం..!

జయదేవ్ ఉనద్కత్

టీమ్ ఇండియాలో కొన్నాళ్ల తర్వాత మళ్లీ జయదేవ్ ఉనద్కత్ పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఉనద్కత్ టీమ్ ఇండియాకు తిరిగి వచ్చాడు. అతను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, వెస్టిండీస్ సిరీస్‌లలో జట్టులో భాగంగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఆడే అవకాశం కూడా వచ్చినా మెప్పించలేకపోయాడు. ఇప్పుడు అతనికి జట్టులో చోటు దక్కలేదు. బహుశా అతని కెరీర్ ముగిసిపోతుందనే ఊహాగానాలు ఉన్నాయి.

ఇషాంత్ శర్మ

టెస్టు క్రికెట్‌లో భారత జట్టుకు అద్భుతాలు చేసిన ఇషాంత్ శర్మ దాదాపు రెండేళ్లుగా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అతను పునరాగమనం చేస్తాడని నిరంతరం ఊహాగానాలు ఉన్నాయి. అయితే మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్ వంటి యువ బౌలర్లు ఇప్పుడు అతని కెరీర్‌కు బ్రేక్ వేశారు.

ఉమేష్ యాదవ్

ఉమేష్ యాదవ్ స్థానం గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియాలో చోటు దక్కటం లేదు. ఇప్పుడు మరోసారి దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపిక కాలేదు. ఈ పర్యటన టీమ్ ఇండియా భవిష్యత్తుకు ప్రమాణంగా పరిగణించబడుతుంది. ఇటువంటి పరిస్థితిలో అతను ఎంపిక కాకపోవడం సెలెక్టర్ల ఎంపికలో అతను ఇకపై భాగం కాదని చూపిస్తుంది.