IPL 2025: ఐపీఎల్ 2025 (IPL 2025) మార్చి 21 నుంచి ప్రారంభం కానుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. ఐపీఎల్ ఫైనల్ మే 25న జరగనుంది. ముంబైలో బీసీసీఐ సమావేశం అనంతరం రాజీవ్ శుక్లా విలేకరులతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ తేదీలను ధృవీకరించారు.
ఐపీఎల్ 18వ సీజన్ తేదీని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ప్రకటించారు. ఐపీఎల్ 2025 మార్చి 21 నుంచి ప్రారంభం కానుందని రాజీవ్ శుక్లా తెలిపారు. అంటే ఈ సీజన్లో తొలి మ్యాచ్ మార్చి 23న జరగనుంది. అయితే తొలి మ్యాచ్ను ఏ జట్లు ఆడతాయనే దానిపై ఇంకా సమాచారం రాలేదు.
ఈసారి మెగా వేలం జరిగింది
ఈసారి ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం నిర్వహించారు. ఈ సమయంలో రిషబ్ పంత్ IPL వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతడిని లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇదే వేలంలో కోల్కతా నైట్ రైడర్స్కు ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయాస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. అతను లీగ్ చరిత్రలో రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. వెంకటేష్ అయ్యర్ను 23.75 కోట్లకు KKR కొనుగోలు చేసింది. ఈ విధంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆల్ రౌండర్ గా నిలిచాడు.
Also Read: Post Office Scheme: పోస్టాఫీస్లో ఖాతా ఉందా.. అయితే ఈ సూపర్ స్కీమ్ మీ కోసమే!
VIDEO | Mumbai: BCCI Vice-President Rajeev Shukla on Special General Meeting says, "Prabhtej Singh Bhatia has been declared treasurer. This was the single point agenda, so that was the discussion. There is no major agenda or anything like that in IPL or WPL. As for the rest, IPL… pic.twitter.com/5vM90po0yT
— Press Trust of India (@PTI_News) January 12, 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఎంపికకు సంబంధించిన అప్డేట్లు కూడా వెలువడ్డాయి. వచ్చే నెలలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపికకు సంబంధించిన సమావేశం జనవరి 18 లేదా 19 తేదీల్లో జరుగుతుందని రాజీవ్ శుక్లా తెలిపారు. ఇప్పటి వరకు ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సహా మూడు జట్లు మాత్రమే టోర్నీకి తమ జట్టులను ప్రకటించాయి.
నూతన కార్యదర్శి, కోశాధికారిని ఎన్నుకున్నారు
ఈ సమావేశంలో దేవ్జిత్ సైకియా, ప్రభతేజ్ సింగ్ భాటియా బిసిసిఐ కొత్త కార్యదర్శి, కోశాధికారిగా ఎన్నికయ్యారు. దేవ్జిత్ సైకియా, ప్రభతేజ్ సింగ్ భాటియా మాత్రమే ఈ పోస్టులకు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.