IPL 2025 Final: పంజాబ్‌- బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య పైచేయి ఎవ‌రిది? గ‌త మూడు మ్యాచ్‌ల్లో ఇరు జ‌ట్ల ఆట‌తీరు ఎలా ఉంది?

ఐపీఎల్ 2025కు ముందు కూడా ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, పీబీకేఎస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మధ్య ఒక టైటిల్ మ్యాచ్ జరిగింది. ఆరు నెలల్లో రెండోసారి వీరిద్దరి మధ్య టైటిల్ ఫైట్ జరుగుతోంది.

Published By: HashtagU Telugu Desk
IPL 2025 Final

IPL 2025 Final

IPL 2025 Final: ఐపీఎల్ 2025లో ట్రోఫీని ఈసారి కొత్త జ‌ట్టు ముద్దాడ‌నుంది. ఒకవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉంటే.. మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు ఉంది. ఎక్కడైతే ఆర్‌సీబీ మొదటి క్వాలిఫయర్‌లో పీబీకేఎస్‌ను ఘోరంగా ఓడించిందో.. అక్కడే రెండో క్వాలిఫయర్‌లో అద్భుతమైన పునరాగమనం చేసి పంజాబ్ విజయం సాధించి, ఫైనల్ టైటిల్ మ్యాచ్‌లో (IPL 2025 Final) స్థానం సంపాదించింది.

ఇప్పుడు ఈ రోజు మ్యాచ్‌కు ముందు ప్రశ్న ఏమిటంటే.. ఈ రెండు జట్లలో ఏ జట్టు బలంగా ఉంది? ఎవరి పైచేయి ఎక్కువగా ఉంది? అనే అంశాల‌ను ఇప్పుడు ఓసారి చూద్దాం.

Also Read: Heinrich Klassen: క్రికెట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్‌!

రెండు జట్ల పనితీరు

ఆర్‌సీబీ, పీబీకేఎస్ రెండు జట్లు ప్లేఆఫ్‌ల వరకు చెరో మ్యాచ్‌లు గెలిచి ఫైన‌ల్‌కు చేరుకున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు 36 సార్లు తలపడ్డాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రెండు జట్లు సమానంగా అంటే 18-18 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. అయినప్పటికీ ఇటీవలి గణాంకాలను చూస్తే ఆర్‌సీబీ పైచేయి సాధించింది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ.. పీబీకేఎస్‌తో మూడు మ్యాచ్‌లు ఆడగా అందులో రెండింటిలో ఆర్‌సీబీ విజయం సాధించింది. అందులో ప్లేఆఫ్‌లో విజయం కూడా ఉంది.

ఆరు నెలల క్రితం కూడా టైటిల్ మ్యాచ్ జరిగింది

ఐపీఎల్ 2025కు ముందు కూడా ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, పీబీకేఎస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మధ్య ఒక టైటిల్ మ్యాచ్ జరిగింది. ఆరు నెలల్లో రెండోసారి వీరిద్దరి మధ్య టైటిల్ ఫైట్ జరుగుతోంది. వాస్త‌వానికి గత సంవత్సరం డిసెంబర్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో పాటిదార్ మధ్యప్రదేశ్ జట్టును నడిపించగా, ముంబై జట్టును శ్రేయస్ నడిపించాడు. అయితే ఆ టైటిల్ మ్యాచ్‌లో శ్రేయస్ జట్టు విజయం సాధించింది.

 

  Last Updated: 03 Jun 2025, 06:55 AM IST