Site icon HashtagU Telugu

Vaibhav Suryavanshi: 13 ఏళ్ల‌కే కోటీశ్వ‌రుడైన యంగ్ ప్లేయ‌ర్‌.. ఎవ‌రీ వైభవ్ సూర్యవంశీ?

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఐపీఎల్ వేలంలో స్టార్ ఆట‌గాళ్ల‌పై భారీగా కాసుల వ‌ర్షం కురిసింది. ముఖ్యంగా పంత్‌, అయ్య‌ర్‌, అర్ష్‌దీప్ సింగ్‌, చాహ‌ల్ లాంటి ఆట‌గాళ్లు ఈ ఐపీఎల్ వేలంలోకి వ‌చ్చి కోట్లు సంపాదించారు. ప్ర‌ముఖ ఆట‌గాళ్లు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. వారిలో ఆసీస్ స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్‌, కేన్ విలియ‌మ్స‌న్ లాంటి స్టార్ ప్లేయ‌ర్స్ ఉన్నారు. అయితే ఈ వేలంలో దేశ‌వాళీ క్రికెట్ ఆడుతున్న అతి పిన్న వయ‌స్కుడిపై కూడా ఐపీఎల్ కాసుల వ‌ర్షం కురిపించింది. కేవ‌లం రూ.30 ల‌క్ష‌ల బేస్ ధ‌ర‌తో వేలంలోకి వ‌చ్చిన బీహార్‌కు చెందిన వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Suryavanshi) చిన్న వ‌య‌సులోనే రూ. 1.10 కోట్లకు ప్ర‌ముఖ జ‌ట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం సౌదీ అరేబియాలో రెండు రోజుల వేలం నిర్వహించారు. ఈ వేలంలో పెద్ద ఆటగాళ్లపై కాసుల వ‌ర్షం కురిసింది. అయితే రూ. 1.10 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసిన ఈ మెగా వేలంలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా ప్రవేశించాడు. దీంతో ఇప్పుడు వేలంలో కొనుగోలు చేసిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ బేస్ ధర రూ.30 లక్షలు. అయితే అతడిని రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది.

Also Read: CAQM: ఢిల్లీలోని పాఠ‌శాల‌లు తెర‌వ‌డంపై CAQM కొత్త సూచ‌న‌లు.. ఏంటంటే?

వైభవ్ సూర్యవంశీ ఎవరు?

వైభవ్ సూర్యవంశీ మార్చి 27, 2011న బీహార్‌లోని సమస్తిపూర్‌లో జన్మించారు. వైభవ్ సాధించిన ఈ విజయం వెనుక క్రికెట్ పట్ల అతని కృషి, అభిరుచి పెద్ద పాత్ర ఉంది. చిన్నవయసులోనే తన ఉనికిని చాటుకున్న అతను జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. అతని తండ్రి సంజీవ్ అతనికి ఐదేళ్ల వయస్సు ఉన్న‌ప్పుడే నెట్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. వైభవ్ సూర్యవంశీ బీహార్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ ఏడాది జనవరిలో ముంబైపై వైభవ్ ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ జట్టులో భాగమై తన ప్రతిభను చాటుకోనున్నాడు.

వైభ‌వ్ కోసం రాజస్థాన్, ఢిల్లీ మధ్య పోటీ

వేలం సమయంలో బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ పేరు రావడంతో అతనిని కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ బిడ్డింగ్ ప్రారంభించాయి. కాగా వైభవ్ సూర్యవంశీ ధర రూ.30 లక్షల నుంచి రూ.1.10 కోట్లకు పెరిగింది. ఈ చివరి బిడ్‌ను రాజస్థాన్ జట్టు చేసింది. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025 సీజన్‌లో సంజూ శాంసన్ కెప్టెన్‌గా ఉన్న రాజస్థాన్ జట్టులో ఆడబోతున్నాడు.

 

Exit mobile version