Site icon HashtagU Telugu

Indian Team: బార్బడోస్‌లోనే టీమిండియా.. మ‌రో రెండు రోజుల్లో భార‌త్‌కు రావ‌చ్చు!

Indian Team

Indian Team

Indian Team: T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జూన్ 29న బార్బడోస్‌లో జరిగింది. ఇందులో భారత్ గెలిచింది. అప్పటి నుండి టీమ్ ఇండియా (Indian Team) ఆటగాళ్లు, వారి కుటుంబాలు, కోచింగ్ సిబ్బంది బార్బడోస్‌లో ఉన్నారు. బార్బడోస్‌లో భారీ వర్షాలు, తుఫాను కారణంగా టీమిండియా బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. టీమిండియా బార్బడోస్‌ను వదిలి ఎప్పుడు భారత్‌కు చేరుకుంటుందోనని అభిమానులు నిత్యం ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు, బార్బడోస్‌లో మరో తుఫాను హెచ్చరిక జారీ చేసింది వాతావ‌ర‌ణ శాఖ‌. దీని తర్వాత టీమ్ ఇండియా మరికొన్ని రోజులు బార్బడోస్‌లోనే ఉండే అవ‌కాశం ఉంది. బార్బడోస్ నుండి ముగ్గురు భారతీయ ఆటగాళ్ళు కూడా జింబాబ్వేకు వెళ్లాల్సి ఉంది. జింబాబ్వేలో టీమిండియా జూలై 6 నుండి T20 సిరీస్ ఆడనుంది. ఇటువంటి పరిస్థితిలో ఈ ఆటగాళ్లు జింబాబ్వేలో జట్టులో చేరడంలో ఆలస్యం కావచ్చు.

Also Read: Marriage Rituals: పెళ్లిలో వధువుని గంపలో ఎందుకు మోసుకొస్తారో తెలుసా?

తుఫాను ఎప్పుడు రావచ్చు?

బార్బడోస్‌లో గత కొన్ని రోజులుగా వాతావరణం చాలా దారుణంగా ఉంది. భారీ వర్షాలు, తుఫానుల కారణంగా అస్త‌వ్య‌స్తంగా మారింది. తుఫాను దృష్ట్యా ప్రభుత్వం లాక్డౌన్ విధించినందున ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. బార్బడోస్ విమానాశ్రయం కూడా మూసిదీని కారణంగావేశారు. దీంతో టీమ్ ఇండియా అక్కడ చిక్కుకుంది. ఇప్పుడు బార్బడోస్‌లో మరో తుఫాను హెచ్చరిక జారీ చేశారు. ఆ తుఫాన్ బుధవారం వచ్చే అవకాశం ఉంది.

దీనికి సంబంధించి బార్బడోస్ పీఎం మియా మోట్లీ మాట్లాడుతూ బుధవారం మరో తుఫాను రాబోతోందని తెలిపారు. దీని కోసం మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. టీమ్ ఇండియా కూడా బార్బడోస్‌లో చిక్కుకుపోయి ఉంది. రాబోయే 12 గంటల్లో విమానాశ్రయాన్ని తెరవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. విమానాశ్రయ సిబ్బందితో నిరంతరం టచ్‌లో ఉన్నాం. తక్షణం అమల్లోకి వచ్చేలా ప్రయాణాన్ని ప్రారంభించడానికి వారు తమ తనిఖీలు చేస్తున్నారు. రానున్న 12 గంటల్లో విమానాశ్రయం తెరుచుకోవచ్చని ఆశిస్తున్నాను అని ఆయ‌న అన్నారు.

We’re now on WhatsApp : Click to Join

ఈ రోజున టీమ్ ఇండియా బయలుదేరవచ్చు

జూన్ 29న భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అప్పటి నుంచి టీమిండియా బార్బడోస్‌లో ఉంది. ఒకవేళ టీమ్ ఇండియా మంగళవారం వెళ్లలేని పక్షంలో మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే బుధవారం కొత్త తుపాను రాబోతోందని బార్బడోస్ ప్రధాని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటువంటి పరిస్థితిలో జూన్ 4 గురువారం లేదా జూన్ 5 శుక్రవారం నాడు టీమ్ ఇండియా అక్కడి నుండి బయలుదేరవచ్చు. కాగా జూలై 6 నుంచి జింబాబ్వేతో టీమ్ ఇండియా తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతం బార్బడోస్‌లో చిక్కుకున్న సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే కూడా ఈ సిరీస్‌కు జట్టులోకి ఎంపికయ్యారు.

Exit mobile version