Olympic Games Paris 2024 : ప్రమాదానికి గురైన దీక్షా దాగర్..

జులై 30న జరిగిన ఈ ఘటనలో దీక్ష, ఆమె తండ్రి క్షేమంగా బయటపడగా, దీక్ష తల్లికి మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు

Published By: HashtagU Telugu Desk
Diksha Dagar Accident

Diksha Dagar Accident

పారిస్ఒలింపిక్స్లో (Olympic Games Paris 2024) సత్తా చాటేందుకు పారిస్ వెళ్లిన గోల్ఫర్ దీక్షా దగర్ (23) కారు ప్రమాదానికి (Car Accident) గురయ్యారు. జులై 30న జరిగిన ఈ ఘటనలో దీక్ష, ఆమె తండ్రి క్షేమంగా బయటపడగా, దీక్ష తల్లికి మాత్రం తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. దీక్ష సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈనెల 7న జరిగే గోల్ఫ్ ఈవెంట్లో ఆమె బరిలోకి దిగనున్నారు. డెఫ్లింపిక్స్, సాధారణ ఒలింపిక్స్లోనూ పాల్గొన్న ఏకైక బధిర గోల్ఫర్ దీక్షనే.

We’re now on WhatsApp. Click to Join.

తన తల్లిదండ్రులు మరియు సోదరుడితో కలిసి ఇండియా హౌస్‌కు ఒక ఈవెంట్ నుండి తిరిగి వస్తుండగా, మంగళవారం సాయంత్రం వారు ప్రయాణిస్తున్న కారును మరొక వాహనం ఢీకొట్టింది. ఆగస్ట్ 7 నుంచి షెడ్యూల్ ప్రకారం దీక్ష ఈవెంట్ ఆడుతుందని ఆమె తండ్రి, కేడీ కల్నల్ నరేన్ దాగర్ తెలిపారు. దీక్షా దాగర్ రెండవసారి ఒలింపిక్ క్రీడలలో పాల్గొంటుంది. ఆగస్టు 7 నుండి 10 వరకు మహిళల గోల్ఫ్ ఈవెంట్‌లో దీక్ష పోటీ పడనుంది. దక్షిణాఫ్రికా గోల్ఫర్ పౌలా రెటో వైదొలిగిన తర్వాత 2020లో టోక్యోలో జరిగిన మునుపటి ఒలింపిక్ గేమ్స్‌లో దీక్షా దాగర్ చివరి నిమిషంలో ప్రవేశించింది.

ఇక ఒలింపిక్స్‌ 2024 బ్యాడ్మింటన్‌ మెన్స్ డబుల్స్​ ఈవెంట్​లో సాత్విక్​రాజ్​ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి నిరాశ ఎదురైంది. క్వార్టర్​ ఫైనల్స్​లో 21-13, 14-21, 16-21 తేడాతో మలేషియా ద్వయం ఆరోన్ – వూ ఇక్​పై ఓడిపోయింది. తర్వాత రౌండ్​లో ఈ మలేషియా ద్వయం చైనాకు చెందిన లియాంగ్ – వాంగ్ చాంగ్​తో తలపడనుంది. డెఫ్లింపిక్స్ మరియు ఒలింపిక్స్ రెండింటిలోనూ భాగమైన ఏకైక గోల్ఫ్ క్రీడాకారిణి దీక్ష. డెఫ్లింపిక్స్‌లో 2022లో స్వర్ణం, 2017లో రజతం సాధించింది. గగన్‌జీత్ భుల్లర్ మరియు శుభంకర్ శర్మ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడంతో పురుషుల పోటీ గురువారం ప్రారంభమైంది.

Read Also : New Car Lunch : ఆగస్ట్‌లో విడుదల కానున్న టాప్ 5 కార్లు..!

  Last Updated: 01 Aug 2024, 08:27 PM IST