Site icon HashtagU Telugu

Indian Flag In Karachi: పాకిస్థాన్‌లో భారత జెండా రెపరెపలాడింది.. తప్పును సరిదిద్దుకున్న పీసీబీ!

Indian Flag In Karachi

Indian Flag In Karachi

Indian Flag In Karachi: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌లోని కరాచీ స్టేడియంలో భారత జెండాను ఎగురవేయక‌పోవ‌డంపై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఇటీవల ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో కరాచీ స్టేడియంలో తీసిన‌ట్లు స‌మాచారం. ఆ వీడియోలో టోర్నమెంట్‌లో పాల్గొనే అన్ని జట్ల జెండాలు ఎగురవేశారు. కానీ ఇక్కడ భారత జెండా లేదు. దీని కారణంగా భారత అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పాక్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కానీ ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన తప్పును సరిదిద్దుకుంది.

పాకిస్థాన్‌లో భారత జెండా రెపరెపలాడింది

ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో హైబ్రిడ్ మోడల్‌లో ఆడబోతోంది. నిజానికి కరాచీ స్టేడియంలో పాకిస్థాన్‌లో ఆడే జట్ల జెండాలు మాత్రమే రెపరెపలాడాయి. దీనిపై పెద్దఎత్తున వాదోపవాదాలు జరిగాయి. ఇలాంటి స‌మ‌యంలోనే ఇప్పుడు ఒక చిత్రం సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో కరాచీ స్టేడియంలో ఇతర దేశాల జెండాలతో పాటు భారతదేశ జెండా కూడా కనిపిస్తుంది. వివాదాన్ని సద్దుమణిగేలా కరాచీలో భారత జెండాను ఎగుర‌వేయాల‌ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.

Also Read: Champions Trophy: నేటి నుంచి ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం.. 12 వేల మంది పోలీసులతో బందోబస్తు

భారత జెండాను ఎగురవేయలేదనే వివాదానికి సంబంధించి పీసీబీ మూలం IANSతో మాట్లాడుతూ.. టీమ్ ఇండియా తన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ను పాకిస్తాన్‌లో ఆడదు. దుబాయ్‌లో ఆడుతుంది. అయితే పాకిస్థాన్‌లోని స్టేడియాల్లో ఆడే జట్ల జెండాలను స్టేడియాల్లో ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.

ఫిబ్రవరి 20న భారత్‌ తొలి మ్యాచ్‌

ఫిబ్రవరి 20 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. రోహిత్ శర్మ అండ్ జ‌ట్టు తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఆ త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 23వ తేదీన టీమిండియా పాక్‌తో త‌ల‌ప‌డ‌నుంది.