BCCI Announces Squad: ఇంగ్లండ్తో జరిగే చివరి మూడు టెస్టుల కోసం టీమిండియాను బీసీసీఐ (BCCI Announces Squad) ప్రకటించింది. ఓ కొత్త ప్లేయర్కి కూడా జట్టులో అవకాశం దక్కింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చారు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ ఈ మూడు టెస్టులకు కూడా దూరంగా ఉన్నాడు. చివరి మూడు టెస్టులకు 17 మంది సభ్యులతో కూడిన టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్లతో పాటు యువ బౌలర్ ఆకాశ్ దీప్ కూడా జట్టులోకి వచ్చాడు. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లతో పాటు వాషింగ్టన్ సుందర్ కు కూడా చోటు దక్కింది.
స్టార్ బ్యాట్స్మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి మూడు టెస్టులకు కూడా తిరిగి జట్టులోకి రాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టుల్లో కూడా కోహ్లీ టీమ్ ఇండియాలో భాగం కాలేదు. కాగా గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ చివరి మూడు టెస్టులకు దూరమయ్యాడు. మొత్తం సిరీస్ నుండి నిష్క్రమించాడు. వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్లోని మిగిలిన మూడు టెస్టులకు విరాట్ కోహ్లీ అందుబాటులో లేడని బీసీసీఐ జట్టు ప్రకటనతో పాటు పత్రికా ప్రకటనలో తెలిపింది. కోహ్లీ నిర్ణయాన్ని బోర్డు పూర్తిగా గౌరవిస్తుంది. మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.
Also Read: Transgender Ticket Inspector: తొలి రైల్వే టిక్కెట్ ఇన్స్పెక్టర్గా హిజ్రా
రవీంద్ర జడేజా, కెఎల్ రాహుల్ పాల్గొనడం BCCI వైద్య బృందం నుండి ఫిట్నెస్ క్లియరెన్స్కు లోబడి ఉంటుంది. అంటే బీసీసీఐ వైద్య బృందం వారు ఫిట్గా ప్రకటించినప్పుడే ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకుంటారు. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ 2024 ఫిబ్రవరి 15న రాజ్కోట్లో ప్రారంభం కాగా, నాలుగో టెస్టు 2024 ఫిబ్రవరి 23న రాంచీలో ప్రారంభం కానుంది. సిరీస్లోని ఐదవ, చివరి టెస్ట్ మార్చి 07, 2024 నుండి ధర్మశాలలో జరుగుతుంది.
We’re now on WhatsApp : Click to Join
తదుపరి టెస్టులకు టీమిండియా జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్*, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (WK), KS భరత్ (WK), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.