India vs Bangladesh: భార‌త్ ఘ‌న విజ‌యం.. సిరీస్ క్లీన్ స్వీప్‌

రికార్డుల కోణంలో చూస్తే.. ఈ మ్యాచ్ భారత్‌కు చిరస్మరణీయంగా మారింది. టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన రెండో జ‌ట్టుగా భారత్‌ నిలిచింది. టీమిండియా 297 పరుగులు చేసింది.

Published By: HashtagU Telugu Desk
India vs Bangladesh

India vs Bangladesh

India vs Bangladesh: బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ (India vs Bangladesh) ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. దీంతో భారత్ 133 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది.

సంజూ శాంస‌న్‌

ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ టీమిండియా విజయ వీరుడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో పెద్ద దుమారమే రేపాడు. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 47 బంతుల్లో 111 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 11 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. అంతకుముందు అతను కేవలం 22 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో రిషద్ వేసిన ఒకే ఓవర్‌లో 5 సిక్స్‌లు బాదాడు.

సూర్యకుమార్ యాదవ్

ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌కు సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన సహకారం అందించాడు. ఒకానొక సమయంలో టీమిండియా 23 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. దీని తర్వాత సంజూతో కలిసి 173 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరి భాగస్వామ్యం కారణంగా టీమ్‌ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతుంది. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 75 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో అతను 8 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు.

Also Read: Professor Saibaba: హైద‌రాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత

రవి బిష్ణోయ్

బౌలర్లు నిరంతరం పరుగులు సాధిస్తున్న ఈ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ తన స్పిన్‌తో మ్యాజిక్ చూపించాడు. తొలి ఓవర్ మెయిడెన్ కూడా చేశాడు. అదే సమయంలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్ తొలిసారిగా ఈ సిరీస్‌లో ఆడటం కనిపించింది.

భారత్ ఎన్నో రికార్డులు సృష్టించింది

రికార్డుల కోణంలో చూస్తే.. ఈ మ్యాచ్ భారత్‌కు చిరస్మరణీయంగా మారింది. టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించిన రెండో జ‌ట్టుగా భారత్‌ నిలిచింది. టీమిండియా 297 పరుగులు చేసింది. అత్యధిక పరుగులు చేసిన జ‌ట్టు పరంగా చూస్తే మంగోలియాపై 314 పరుగులు చేసిన నేపాల్ జ‌ట్టు మొద‌టి స్థానంలో ఉంది. కాగా, భారత్ తర‌పున టీ20 మ్యాచ్‌ల్లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా సంజూ శాంసన్ నిలిచాడు. 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే సెంచరీ చేసిన రోహిత్ శర్మ పేరిట ఉంది. ఇప్పటి వరకు టీ20లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రికార్డు టీమిండియా పేరిట‌నే ఉంది.

  Last Updated: 12 Oct 2024, 11:25 PM IST