India tour of Bangladesh: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా.. ఎప్ప‌టినుంచి అంటే..?

టీమిండియా ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది.

Published By: HashtagU Telugu Desk
ind vs aus

ind vs aus

టీమిండియా ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం బంగ్లాదేశ్‌లో భారత పర్యటన డిసెంబర్ 4న మిర్పూర్‌లో పరిమిత ఓవర్ల గేమ్‌తో ప్రారంభమవుతుంది. 2015లో చివరిసారిగా బంగ్లాదేశ్‌లో భారత్‌ పర్యటించింది. రెండు దేశాల మధ్య మ్యాచ్ లు కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇదే విషయాన్ని బంగ్లా క్రికెట్ బోర్డు కూడా పేర్కొంది.

ఈ సిరీస్‌పై బీసీబీ ప్రెసిడెంట్ నజ్ముల్ హసన్ మాట్లాడుతూ..బంగ్లాదేశ్-భారత్ మ్యాచ్‌లు కొన్ని పురాణ పోటీలను అందిస్తాయి. రెండు దేశాల అభిమానులు మరో చిరస్మరణీయ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)కు ధన్యవాదాలు. బంగ్లాదేశ్‌కు వచ్చే భారత జట్టును స్వాగతించడానికి మేము ఎదురుచూస్తున్నాము అని హసన్ అన్నారు.

బీసీసీఐ సెక్రటరీ జై షా మాట్లాడుతూ.. భారత్‌తో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్-బంగ్లాదేశ్ పోటీలు అభిమానులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తాయి. రెండు జట్ల అభిమానులకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. డిసెంబర్ 4, 7, 10 తేదీలలో వన్డేలు, డిసెంబర్ 14-18, 22-26 తేదీలలో టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి.

  Last Updated: 20 Oct 2022, 06:25 PM IST