India Squad: టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత్ జట్టు (India Squad)ను బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా ఆడనుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలక్షన్ కమిటీ మంగళవారం నాడు సమావేశమైంది. ఈ సమావేశం తర్వాత భారత జట్టును బీసీసీఐ అధికారులు ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యారు. రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్లు జట్టులో చోటు దక్కించుకున్నారు.
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2024 announced 🚨
Let's get ready to cheer for #TeamIndia #T20WorldCup pic.twitter.com/jIxsYeJkYW
— BCCI (@BCCI) April 30, 2024
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్, సంజూ శాంసన్లకు జట్టులో చోటు కల్పించింది. ఐపీఎల్ 2024లో శాంసన్, పంత్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. రిషబ్ చాలా కాలం తర్వాత టీమ్ ఇండియాలోకి వచ్చాడు. కారు ప్రమాదం జరిగినప్పటి నుంచి అతను మైదానానికి దూరంగా ఉన్నాడు. కానీ ఐపీఎల్ ద్వారా మళ్లీ మైదానంలోకి వచ్చి తన ఫామ్ నిరూపించుకున్నాడు. శాంసన్ గురించి మాట్లాడుకుంటే.. IPL 2024లో 9 మ్యాచ్లు ఆడి 385 పరుగులు చేశాడు. ఈ సమయంలో సంజూ 4 అర్ధ సెంచరీలు సాధించాడు.
శివమ్ దూబే, అక్షర్ పటేల్లపై బీసీసీఐ కూడా విశ్వాసం వ్యక్తం చేసింది. శివమ్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. దూబే ఫినిషర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సీజన్లో శివమ్ దూబే 9 మ్యాచ్ల్లో 350 పరుగులు చేశాడు. ఈ సమయంలో 3 అర్ధ సెంచరీలు సాధించాడు. అక్షర్ గురించి మాట్లాడుకుంటే.. బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే ఎల్ఎస్జీ కెప్టెన్ కేఎల్ రాహుల్కు ఈ ప్రపంచ కప్ జట్టులో చోటుదక్కలేదు.
Also Read: England Squad: టీ20 ప్రపంచకప్కు ఇంగ్లండ్ జట్టు ఇదే.. రీఎంట్రీ ఇచ్చిన ప్రమాదకరమైన బౌలర్..!
T20 ప్రపంచ కప్ 2024 కోసం భారత క్రికెట్ జట్టు
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్, శుభమాన్ గిల్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, రింకూ సింగ్.
We’re now on WhatsApp : Click to Join