Site icon HashtagU Telugu

Asia Cup: టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ వేట!

Suryakumar Yadav

Suryakumar Yadav

Asia Cup: బీసీసీఐ (BCCI), డ్రీమ్11 మధ్య ఉన్న జెర్సీ స్పాన్సర్ ఒప్పందం ముగిసింది. ఈ ఒప్పందం 2023 నుండి మార్చి 2026 వరకు ఉండాల్సి ఉంది. కానీ ఇటీవల అమలులోకి వచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ సవరణ 2025 కారణంగా డ్రీమ్11కు భారీ నష్టం వాటిల్లడంతో, ఆ సంస్థ బీసీసీఐతో ఉన్న ఒప్పందాన్ని గడువు కంటే ముందే రద్దు చేసుకుంది. దీంతో బీసీసీఐ ఇప్పుడు కొత్త జెర్సీ స్పాన్సర్ కోసం వేట ప్రారంభించింది. సెప్టెంబర్ 9 నుండి ప్రారంభమయ్యే ఆసియా కప్ (Asia Cup) 2025కు ముందు టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్‌పై ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది.

స్పాన్సర్‌షిప్‌పై తాజా సమాచారం

డ్రీమ్11 తర్వాత టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ కోసం బీసీసీఐ వేగంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రస్తుతానికి ఎటువంటి స్పష్టత లేదు. సెప్టెంబర్ 9 నుండి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం.. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు జెర్సీపై స్పాన్సర్ లోగో లేకుండానే ఆడనుంది. కొత్త స్పాన్సర్ దొరికే వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని సమాచారం. ప్రస్తుతం బీసీసీఐ ఈ విషయంపై అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు.

Also Read: India vs China: హాకీ ఆసియా కప్ 2025.. చైనాపై భారత్ ఘన విజయం!

డ్రీమ్11కు భారీ నష్టం

కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ మనీ గేమింగ్ సవరణను రెండు ప్రధాన విభాగాలుగా విభజించింది. మొదటి విభాగంలో ఈ-స్పోర్ట్స్ గేమింగ్‌ను, రెండవ విభాగంలో ఆన్‌లైన్ మనీ గేమింగ్‌ను చేర్చింది. ఈ సవరణ వల్ల మనీ గేమింగ్ యాప్‌లకు భారీ నష్టం వాటిల్లింది. ఈ కొత్త చట్టం ద్వారా యూజర్లతో నేరుగా డబ్బు లావాదేవీలు నిర్వహించే యాప్‌లపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది.

కొత్త చట్టం ప్రకారం.. ఈ యాప్‌లు ఆర్థిక లావాదేవీలు నిర్వహించకూడదు. దీంతో డ్రీమ్11 కూడా తన వినియోగదారులతో డబ్బు లావాదేవీలను నిలిపివేసింది. ఈ చర్య వల్ల కంపెనీ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. ఇదే డ్రీమ్11 తన స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమలో గణనీయమైన మార్పులకు దారితీశాయి.

Exit mobile version