Site icon HashtagU Telugu

Flag Football Championship: లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028కి ముందు భార‌త్‌కు బిగ్ షాక్‌..!

Flag Football Championship

Flag Football Championship

Flag Football Championship: లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028కి ముందు భారతదేశానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే భారత పురుషుల ఫ్లాగ్ ఫుట్‌బాల్ జట్టు రాబోయే ఫ్లాగ్ ఫుట్‌బాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ (Flag Football Championship)లో పాల్గొనలేకపోతుంది. ఆగస్టు 27 నుంచి 30 వరకు ఫిన్‌లాండ్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఒలింపిక్స్ కోణంలో ఈ టోర్నీ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు టీమ్ ఇండియా వీసా పొందలేకపోయిందని, ఈ కారణంగా ఈ టోర్నమెంట్‌లో ఆడేందుకు ఫిన్‌లాండ్ వెళ్లలేక‌పోతున్నార‌ని నివేదిక‌లు పేర్కొన్నాయి. అమెరికా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ డాక్టర్ సందీప్ చౌదరి కూడా టీమ్ ఇండియా వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనలేకపోతుంద‌నే వార్తలను ఆమోదించారు.

తదుపరి ఒలింపిక్స్‌లో ఈ గేమ్‌ను తొలిసారి ఆడనున్నారు

లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028లో ఫ్లాగ్ ఫుట్‌బాల్ మొదటిసారిగా చేర్చారు. ఈ గేమ్ కూడా ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. జట్టుకృషి, వ్యూహం, నైపుణ్యం పరంగా ఆట చాలా మంచిదని భావిస్తారు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జట్లు ఒలింపిక్ కోటా సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Also Read: BCCI: భారీగా పెరిగిన బీసీసీఐ ఆదాయం.. 2023లో రూ.5,120 కోట్ల లాభం..!

భారత్‌కు వరుసగా రెండోసారి షాక్ తగిలింది

2021 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు పాల్గొంది. ఇజ్రాయెల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ 20వ స్థానంలో నిలిచింది. 2023లో జరిగే ఈ ఛాంపియన్‌షిప్‌కు భారత జట్టు అర్హత సాధించలేకపోయింది. వీసా సంబంధిత సమస్యల కారణంగా ఈసారి జట్టు టోర్నీకి దూరంగా ఉండాల్సి వస్తుంది.

అమెరికా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ సందీప్ చౌదరి మాట్లాడుతూ.. ఇది కేవలం వీసాకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. నిర్వాహకుల వైపు నుండి ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నాయి. వాటిని మేము సకాలంలో పరిష్కరించలేకపోయాము. మా వైపు నుంచి కూడా చాలా సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఆ నిందను వేరొకరిపై మోపడం మాకు ఇష్టం లేదు. అందరూ మాకు సహాయం చేయడానికి ప్రయత్నించారు. 2028 ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న మొదటి ముఖ్యమైన టోర్నమెంట్ ఇది అని ఆయ‌న తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.