Dharamshala Test Match: నేటి నుంచి భార‌త్‌- ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య చివ‌రి టెస్టు.. ముగ్గురు బౌల‌ర్ల‌తో బ‌రిలోకి..!

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల మైదానం (Dharamshala Test Match)లో నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి మ్యాచ్ ప్రారంభం కానుంది.

Published By: HashtagU Telugu Desk
Teamindia Tour Of England

Teamindia Tour Of England

Dharamshala Test Match: హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల మైదానం (Dharamshala Test Match)లో నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత జట్టు మార్చి 3న ధర్మశాల చేరుకుంది. కాగా భారత జట్టు మార్చి 4 నుంచి ప్రాక్టీస్ ప్రారంభించింది. ధర్మశాల టెస్టుకు ఒకరోజు ముందు ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించింది. ఇంగ్లిష్ జట్టు ఆలీ రాబిన్‌సన్‌ను తొలగించి.. ధర్మశాల టెస్టు కోసం మార్క్ వుడ్‌ను జట్టులోకి తీసుకుంది.

ధర్మశాల టెస్టులో ఇంగ్లిష్ జట్టు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో వెళుతుంది, అయితే మ్యాచ్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాన్ని మార్చుకుని ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో కాకుండా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో వెళ్లవచ్చని అంచనాలు ఉన్నాయి. ముగ్గురు బౌలర్లతో వెళ్లడానికి అతిపెద్ద కారణం ధర్మశాల పిచ్, అక్కడి వాతావరణం. ఈ పిచ్‌ ఫాస్ట్ బౌలర్లకు స్పిన్ కంటే ఎక్కువగా సహాయపడుతుంది.

ముగ్గురు బౌలర్లతో..?

ధర్మశాల రికార్డును పరిశీలిస్తే పిచ్‌పై స్పిన్ బౌలింగ్ ఫాస్ట్ బౌలర్లకు మరింత సహాయపడుతుంది. అయితే ధర్మశాలలో భారత్ ఇప్పటివరకు ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడింది. ఇందులో భారత జట్టు ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో వెళ్లింది. అయితే ఈ మ్యాచ్ 2017లో ఆస్ట్రేలియాతో జరిగింది. దాదాపు 7 ఏళ్ల తర్వాత ధర్మశాలలో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత్ రంగంలోకి దిగనుంది. అయితే ఇక్కడ స్పిన్ బౌలర్ల కంటే ఫాస్ట్ బౌలింగ్‌కే ఎక్కువ సహాయం అందుతుందని తెలుస్తోంది.

గణాంకాల గురించి చెప్పాలంటే.. ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 20 మ్యాచ్‌లు ఆడబడ్డాయి. ఇందులో స్పిన్, ఫాస్ట్ బౌలర్లు కలిసి 248 వికెట్లు తీశారు. గమనించాల్సిన విషయం ఏంటంటే.. వీటిలో 153 వికెట్లు ఫాస్ట్ బౌలర్లే తీశారు. కాగా.. స్పిన్నర్లు 95 వికెట్లు తీశారు. ఈ గణాంకాలను చూసిన తర్వాత ధర్మశాల టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ త్రయంతో బ‌రిలోకి దిగ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.

Also Read: Kangana Ranaut : స్టార్ హీరోల పెయిడ్ డ్యాన్సులు… కంగనా కామెంట్స్‌..!

జస్ప్రీత్ బుమ్రా తిరిగి జ‌ట్టులోకి

రాంచీ టెస్ట్‌లో విశ్రాంతి తీసుకున్న తర్వాత భారత జట్టు యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ధర్మశాల టెస్టులో జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. పనిభారం కారణంగా రాంచీ టెస్టులో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. బుమ్రా గైర్హాజరీలో అరంగేట్రం ఆటగాడు ఆకాశ్ దీప్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను దెబ్బ‌తీశాడు. అయితే బుమ్రా పునరాగమనం తర్వాత భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ధర్మశాల టెస్టులో కుల్దీప్ యాదవ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగవచ్చని భావిస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

ధర్మశాల టెస్టుపై భారత్ దృష్టి

సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత ఇంగ్లండ్ జట్టు భారత్‌కు పునరాగమనం చేసే అవకాశం ఇవ్వదని భావించారు. అయితే విశాఖపట్నం టెస్టులో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ కారణంగా భారత్ 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఆ తర్వాత రాజ్ కోట్ టెస్టులో రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో ఇంగ్లండ్ వెన్ను విరిచి 434 పరుగులతో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాడు.

రాజ్‌కోట్ తర్వాత రాంచీ టెస్టులో భారత యువ ఆటగాళ్లు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ధర్మశాల టెస్టులో భారత్ విజయానికి వీరుడు ఎవరనేది వేచి చూడాల్సిందే. అయితే ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ ధర్మశాల టెస్టులో భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవాలని చూస్తున్నాడు.

  Last Updated: 07 Mar 2024, 06:57 AM IST