India beat Nepal: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు నేపాల్ (India beat Nepal)ను ఓడించింది. వర్షం కారణంగా నేపాల్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమ్ ఇండియా సూపర్-4 రౌండ్కు చేరుకుంది. వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం భారత జట్టుకు 23 ఓవర్లలో 145 పరుగుల విజయలక్ష్యాన్ని అందించారు. ఈ మ్యాచ్లో భారత జట్టు 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 147 పరుగులు సాధించింది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ 59 బంతుల్లో 74 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. కాగా, శుభ్మన్ గిల్ 62 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ కలిసి తొలి వికెట్కి శతాధిక భాగస్వామ్యంతో మ్యాచ్ని 20 ఓవర్లలోనే ముగించారు. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న రోహిత్ శర్మకు కెరీర్లో ఇది 49వ వన్డే హాఫ్ సెంచరీ. ఆసియా కప్లో 10 సార్లు 50+ స్కోర్లు బాదిన మొదటి భారత క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్.
Also Read: Jasprit Bumrah: మగ బిడ్డకు జన్మనిచ్చిన బుమ్రా సంజనా గణేశన్ దంపతులు
అంతకుముందు టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన నేపాల్ జట్టు 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. నేపాల్ తరఫున వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అసిఫ్ షేక్ అత్యధిక పరుగులు చేశాడు. ఆసిఫ్ షేక్ 97 బంతుల్లో 58 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్లో 8 ఫోర్లు కొట్టాడు. సోంపాల్ కమీ 56 బంతుల్లో 48 పరుగులు చేశాడు. కుశాల్ భుర్టెల్ 25 బంతుల్లో 38 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్మెన్ నిరాశపరిచారు.
భారత్ తరఫున రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ 3-3 వికెట్లు తీశారు. దీంతో పాటు మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్ 1-1 వికెట్ తీశారు. ఆసియా కప్ 2023 చివరి లీగ్ మ్యాచ్ సెప్టెంబర్ 5న జరగనుంది. అదే సమయంలో సెప్టెంబర్ 6 నుంచి సూపర్-4 రౌండ్ మ్యాచ్లు జరగనున్నాయి. కాగా ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరగనుంది.