Brian Lara Stadium: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్ నేడు జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ట్రినిడాడ్లోని బ్రియాన్ లారా స్టేడియంలో (Brian Lara Stadium) ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎవరు గెలిస్తే సిరీస్ వారికి దక్కుతుంది. తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత రెండో వన్డేలో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నేడు జరగబోయే మూడో వన్డే కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బ్రియాన్ లారా స్టేడియంలో తొలిసారి వన్డే జరగనుంది
బ్రియాన్ లారా మైదానంలో ఏ టెస్టు మ్యాచ్ గానీ, వన్డే మ్యాచ్ గానీ జరగలేదు. తొలిసారిగా ఈ మైదానంలో పురుషుల జట్ల వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. అయితే ఈ మైదానంలో మహిళల జట్టు మ్యాచ్ ఆడింది. 2022లో ఈ మైదానంలో వెస్టిండీస్తో టీమ్ ఇండియా టీ20 మ్యాచ్ ఆడింది. అందులో ఆతిధ్య జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మైదానంలో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 20 ఓవర్లలో 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో వెస్టిండీస్ జట్టు 122 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పిచ్ నివేదిక
ఇక్కడ ODI మ్యాచ్ ఆడలేదు. కానీ T20 మ్యాచ్ పిచ్ నివేదిక ఆధారంగా.. బ్యాట్స్మెన్, బౌలర్లు ఇద్దరూ ఇక్కడ రాణించగలరు. టాస్ గెలిచిన జట్టు ఇక్కడ ఛేజింగ్ చేయాలనుకోవచ్చు.
Also Read: Bumrah: బుమ్రా వచ్చేశాడు.. ఐర్లాండ్ తో సీరీస్ కు భారత్ జట్టు ఇదే..!
మ్యాచ్ అంచనా
మూడో వన్డేకు సంబంధించి మ్యాచ్ ప్రిడిక్షన్ మీటర్ టీమ్ ఇండియాదే పైచేయి అని చెబుతోంది. రెండో వన్డేలో వెస్టిండీస్ చాలా సులువుగా గెలిచినా.. మూడో మ్యాచ్లో మాత్రం వెస్టిండీస్ టీమ్ బలహీనంగా ఉంది. రోహిత్, విరాట్లు పునరాగమనం చేస్తే టీమ్ఇండియా సులువుగా సిరీస్ కైవసం చేసుకోవచ్చు.
మూడో వన్డేకు భారత్ జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్.