Site icon HashtagU Telugu

IND vs WI 1st Test: తొలిరోజే పట్టు బిగించిన టీమిండియా.. అశ్విన్‌, జడేజా ధాటికి 150 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్

Rohit Sharma- Yashasvi Jaiswal

Resizeimagesize (1280 X 720) 11zon

IND vs WI 1st Test: భారత్-వెస్టిండీస్ మధ్య బుధవారం నుంచి డొమినికా వేదికగా తొలి టెస్టు (IND vs WI 1st Test) మ్యాచ్ జరుగుతుంది. మొదటి రోజు మ్యాచ్‌ లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలి రోజు ఆట ముగిసే వరకు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. టీమిండియా తరఫున రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణిస్తున్నారు.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ తర్వాత యశస్వి, రోహిత్‌లు టీమిండియాకు ఓపెనర్‌గా వచ్చారు. యశస్వి అరంగేట్రం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. అతను 73 బంతులు ఎదుర్కొని అజేయంగా 40 పరుగులు చేశాడు. కాగా రోహిత్ 65 బంతులు ఎదుర్కొని 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి మధ్య 80 పరుగుల భాగస్వామ్యం ఉంది. ఈ భాగస్వామ్యాన్ని వెస్టిండీస్ బౌలర్లు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. ప్రస్తుతం వెస్టిండీస్ కంటే టీమిండియా 70 పరుగులు వెనుకబడి ఉంది.

Also Read: Flight Ticket Cancellation : ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేస్తే జస్ట్ 20 రూపాయలు రిటర్న్ వచ్చాయి.. వైరల్ అవుతున్న IAS ఆఫీసర్ ట్వీట్..

అశ్విన్ కి చిక్కిన వెస్టిండీస్ ఆటగాళ్లు

డొమినికా టెస్టులో వెస్టిండీస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆ జట్టు కేవలం 150 పరుగులకే ఆలౌట్ అయింది. భారత స్పిన్ బౌలర్లు అశ్విన్, జడేజా జట్టుపై తమ స్పిన్ బలాన్ని చూపించారు. అశ్విన్ 5 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీశారు. వెస్టిండీస్ తరఫున అలీక్ అత్యధికంగా 47 పరుగులు చేశాడు. 99 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. కెప్టెన్ బ్రైత్‌వైట్ కేవలం 20 పరుగులకే ఔటయ్యాడు. తేజ్‌నారాయణ్ చందర్‌పాల్ 12 పరుగులు చేసిన తర్వాత నిష్క్రమించాడు. చివర్లో కార్న్‌వాల్ 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

భారత్ తరఫున అశ్విన్ 24.3 ఓవర్లలో 60 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 6 మెయిడెన్ ఓవర్లు కూడా వేశాడు. అశ్విన్‌కి ఈ ఇన్నింగ్స్‌ ప్రత్యేకమైనది. అతను 700 అంతర్జాతీయ వికెట్లు పూర్తి చేశాడు. రవీంద్ర జడేజా 14 ఓవర్లలో 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతను 7 మెయిడెన్ ఓవర్లు వేశాడు. శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీశారు.