Manchester Test: భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్కి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. మాంచెస్టర్లోని (Manchester Test) ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్లో జరగనున్న ఈ మ్యాచ్ భారత్కు చాలా కీలకం. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. కాబట్టి సిరీస్లో నిలబడాలంటే భారత్ ఈ మ్యాచ్ గెలవాలి. అయితే, వర్షం ఈ మ్యాచ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
మాంచెస్టర్ వాతావరణం
ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరిగే నాలుగో టెస్ట్ మ్యాచ్లో వాతావరణం హెచ్చుతగ్గులతో కూడి ఉంది. మొదటి రోజు (జులై 24) వర్షం పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 65% వర్షం కురిసే అవకాశం ఉంది. రెండో రోజు (జులై 25) వాతావరణం మరింత దిగజారే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం 84% వరకు ఉంది. మూడో రోజు (జులై 26) ఆకాశం స్పష్టంగా ఉంటుంది. వర్షం పడే అవకాశం 7% మాత్రమే. నాలుగో రోజు (జులై 27) వాతావరణం ఇంకా బాగుంటుంది. వర్షం పడే అవకాశం 10% ఉంటుంది. ఐదో రోజు (జులై 28) ఎండ ఉంటుంది. కానీ సాయంత్రం 40% వర్షం పడే అవకాశం ఉంది. మొత్తంగా మాంచెస్టర్ టెస్ట్కు మొదటి రెండు రోజులు మాత్రమే వర్షం ముప్పు ఎక్కువగా ఉంది. ఆ తర్వాత వాతావరణం చాలా వరకు స్పష్టంగా ఉండవచ్చు.
Also Read: Dharmasthala Incident : ధర్మస్థల హత్యల మిస్టరీ ..అసలు నిజాలేంటి..?
భారత జట్టులో మార్పులు
మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఆకాశ్ దీప్ పూర్తిగా ఫిట్గా లేడు. అతని స్థానంలో అంశుల్ కంబోజ్ లేదా ప్రసిద్ధ్ కృష్ణ ఆడవచ్చు. శుభ్మన్ గిల్ చెప్పిన ప్రకారం.. ఈ ఇద్దరిలో ఒకరు మాంచెస్టర్లో తమ బౌలింగ్ ప్రతిభను చూపించవచ్చు. నీతీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ లేదా కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు దక్కించుకోవచ్చు. కరుణ్ నాయర్ మొదటి మూడు టెస్టుల్లో విఫలమయ్యాడు. అతని స్థానంలో ఇప్పుడు సాయి సుదర్శన్కు అవకాశం లభించవచ్చు. ఈ మార్పులు భారత జట్టుకు ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి.