Manchester: భారత్, ఇంగ్లండ్ల మధ్య జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మొదటి ఇన్నింగ్స్లో 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. నాల్గవ రోజు వచ్చేసరికి పిచ్పై బ్యాటింగ్ చేయడం మరింత కష్టతరంగా మారిన నేపథ్యంలో టీమ్ ఇండియాకు ఇంగ్లండ్ ముందు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించడం ఒక సవాలుగా మారింది. మాంచెస్టర్లోని (Manchester) ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇప్పటివరకు నమోదైన విజయవంతమైన ఛేజింగ్ల గణాంకాలను పరిశీలిద్దాం.
మాంచెస్టర్లో అతిపెద్ద విజయవంతమైన ఛేజ్లు
నాల్గవ టెస్ట్లో భారత జట్టుకు కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఎందుకంటే ఓల్డ్ ట్రాఫర్డ్లో టెస్ట్ మ్యాచ్లో ఇప్పటివరకు ఏ జట్టూ 300 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేజ్ చేయలేదు. ఈ మైదానంలో అతిపెద్ద విజయవంతమైన ఛేజ్ ఇంగ్లాండ్ పేరిట ఉంది.
- ఇంగ్లాండ్ – 294 పరుగులు.. 2008లో న్యూజిలాండ్పై సాధించింది.
- ఇంగ్లాండ్ – 277 పరుగులు: 2020లో పాకిస్థాన్పై సాధించింది.
- ఇంగ్లాండ్ – 231 పరుగులు: వెస్టిండీస్పై సాధించింది.
- ఇంగ్లాండ్ – 205 పరుగులు: శ్రీలంకపై సాధించింది.
ఇక విదేశీ జట్ల విషయానికి వస్తే ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇప్పటివరకు ఏ విదేశీ జట్టూ 200 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయలేకపోయింది. కనీసం 150 పరుగుల లక్ష్యాన్ని కూడా సాధించలేకపోయింది. ఇక్కడ విదేశీ జట్టు చేసిన అతిపెద్ద విజయవంతమైన ఛేజ్ దక్షిణాఫ్రికా పేరిట ఉంది.
Also Read: Iran Terror Attack: ఇరాన్లోని భవనంపై దాడి.. 9 మంది మృతి, పాకిస్థాన్ హస్తం ఉందా?
- దక్షిణాఫ్రికా – 145 పరుగులు: 1955లో ఇంగ్లాండ్పై సాధించింది.
భారత్ విజయం సాధించాలంటే?
ప్రస్తుత టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. ఇంగ్లాండ్ గతంలో 294 పరుగుల లక్ష్యాన్ని కూడా విజయవంతంగా ఛేజ్ చేయగలిగింది. వారి ప్రస్తుత ‘బాజ్బాల్’ శైలిని పరిగణనలోకి తీసుకుంటే వారు 350 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేజ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.
మ్యాచ్ను గెలిచే స్థితిలోకి రావాలంటే భారత్ మొదట 311 పరుగుల ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని అధిగమించాలి. ఆ తర్వాత ఇంగ్లాండ్ ముందు కనీసం 300 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాలి. అంటే భారత జట్టు రెండవ ఇన్నింగ్స్ మొత్తం 600 పరుగులకు పైగా స్కోర్తో ముగిస్తేనే విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుత పిచ్ పరిస్థితులలో భారత బ్యాట్స్మెన్లకు ఒక అసాధ్యమైన సవాలుగా కనిపిస్తోంది.