Site icon HashtagU Telugu

IND vs ENG: ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌ను ఛాంపియన్స్ ట్రోఫీ నుండి కూడా సైడ్ చేస్తారా?

Chepauk

Chepauk

IND vs ENG: జనవరి 22 నుంచి భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇంగ్లండ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి టీం ఇండియా జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. ఇందులో ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయ‌లేదు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి కూడా విస్మరిస్తారా అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది.

కుల్దీప్ యాదవ్

టీమ్ ఇండియా స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ గాయం కారణంగా చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో స్వదేశంలో ఆడిన టెస్ట్ సిరీస్‌లో కుల్దీప్ వెన్ను గాయానికి గురయ్యాడు. ఆ తర్వాత ఈ బౌలర్ జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఈ ఆటగాడు పునరాగమనం చేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ అది జరగలేదు. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కుల్దీప్ యాదవ్‌ను టీమిండియా ఎంపిక చేయలేదు.

Also Read: MLA Danam Nagender: KTRకు నేను క్లీన్ చిట్ ఇవ్వలేదు: ఎమ్మెల్యే దానం నాగేందర్

ప్రస్తుతం ఈ బౌలర్ NCAలో ఉన్నాడు. ఇప్పటివరకు కుల్దీప్ ఫిట్‌నెస్‌పై తాజా అప్‌డేట్ లేదు. వెన్ను గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా కుల్దీప్‌కి టీమ్ ఇండియాలో అవకాశం రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి కుల్దీప్ జట్టులోకి వస్తాడా లేదా అనేది చూడాలి.

రిషబ్ పంత్

ఐపీఎల్ 2024లో అద్భుతంగా పునరాగమనం చేసినప్పటి నుంచి రిషబ్ పంత్ టీమ్ ఇండియా తరఫున నిరంతరం ఆడుతున్నాడు. ఇటీవల పంత్ ఆస్ట్రేలియాతో ఆడిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఆడుతున్నట్లు కనిపించింది. కానీ ఇప్పుడు పంత్‌కు ఇంగ్లాండ్‌తో T20 సిరీస్‌కు అవకాశం రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, రిషబ్ పంత్ మధ్య పోటీ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో సెలెక్టర్లు ఏ వికెట్ కీపర్‌ను ఎక్కువగా విశ్వసిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఇద్దరు వికెట్‌కీపర్లు సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్‌లు జట్టులో ఉన్నారు.

Exit mobile version