Site icon HashtagU Telugu

IND vs AUS 2nd Test: ఓట‌మికి చేరువ‌లో టీమిండియా.. రెండో రోజు ముగిసిన ఆట‌!

Boxing Day Test Tickets

Boxing Day Test Tickets

IND vs AUS 2nd Test: డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS 2nd Test) మధ్య టెస్టు సిరీస్ రెండో మ్యాచ్ జరగనుంది. ఈరోజు ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట కూడా ముగిసింది. అయితే టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో ఓట‌మికి చేరువ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. జట్టుకు పెద్ద, సుదీర్ఘ భాగస్వామ్యం అవసరం. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 337 పరుగులు చేసి 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇదే సమయంలో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయింది. రిషబ్ పంత్, నితీష్ రెడ్డి క్రీజులో ఉన్నారు.

రెండో ఇన్నింగ్స్‌లోనూ టాప్‌ ఆర్డర్ విఫ‌లం

అడిలైడ్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా టాప్‌ ఆర్డర్ విఫ‌ల‌మైంది. అయితే అంతకు ముందు టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ తొలి ఇన్నింగ్స్‌లోనూ నిరాశ‌ప‌రిచింది. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 24, కేఎల్ రాహుల్ 7, శుభ్‌మన్ గిల్ 28, విరాట్ కోహ్లీ 11, రోహిత్ శర్మ 6 పరుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగారు. అయితే జైస్వాల్, గిల్ మధ్య 30 పరుగుల భాగస్వామ్యం ఉంది. జట్టు ఇప్పుడు రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డిలపై ఆశలు పెట్టుకుంది. పంత్ 28, నితీష్ 15 పరుగులతో ఆడుతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 128/5 (24).

Also Read: South Central Railway: రైల్వేలో కీలకమైన విభాగాలకు నాయకత్వం వహిస్తున్న మహిళా అధికారులు!

రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆస్ట్రేలియా చాలా ప్రమాదకరంగా బౌలింగ్ చేసింది. కెఎల్ రాహుల్ రూపంలో కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత స్కాట్ బోలాండ్ యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత మిచెల్ స్టార్క్ శుభ్‌మన్ గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే కెప్టెన్ 5వ వికెట్ తీశాడు. అంటే 6 పరుగులకే కమిన్స్ రోహిత్‌ను పెవిలియన్‌కు పంపాడు.

రెండో రోజులు సాగిందిలా!

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి రెండు సెషన్లు ఆడి 180 పరుగులకు ఆలౌటైంది. దీని తర్వాత ఆస్ట్రేలియా తొలి రోజు మూడో సెషన్‌కు, రెండో రోజు తొలి రెండు సెషన్లకు బ్యాటింగ్ చేయడంతో ఆ జట్టు 337 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 157 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి 29 పరుగుల వెనుకంజలో ఉంది.