PAK vs NZ: పాకిస్థాన్- న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల కనీసం ఒక్క బంతి కూడా వేయడం సాధ్యపడలేదు. ఈ మ్యాచ్లో పాక్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ ఆ తర్వాత వర్షం అస్సలు తగ్గలేదు. మ్యాచ్ అధికారులు కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని ప్రయత్నించినప్పటికీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు.
సూపర్-8లో ఈ మొదటి మ్యాచ్ రద్దు కావడంతో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లకు చెరో పాయింట్ లభించింది. ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించడానికి రాత్రి 10:16 గంటలను కట్-ఆఫ్ టైమ్గా నిర్ణయించారు. కానీ వర్షం తగ్గకపోవడంతో రాత్రి 9:05 గంటల ప్రాంతంలో మ్యాచ్ను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెటర్!
ఈ మ్యాచ్కు ముందు బాబర్ ఆజం ఆడటంపై సందిగ్ధత నెలకొంది. బాబర్ వరుసగా ఫామ్ కోల్పోవడంతో పాటు అతని స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ అతనికి ప్లేయింగ్ ఎలెవన్లో అవకాశం ఇచ్చారు. అయితే ఈసారి పాకిస్థాన్ జట్టులోకి ఫఖర్ జమాన్ తిరిగి వచ్చాడు. ఖ్వాజా నఫాయ్ స్థానంలో ఫఖర్ జట్టులోకి చేరాడు. మరోవైపు న్యూజిలాండ్ కూడా పూర్తి సన్నద్ధతతో మైదానంలోకి దిగింది. కివీస్ జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్లో ఏకంగా మూడు మార్పులు చేసింది. ఈష్ సోధి, లాకీ ఫెర్గూసన్ కూడా జట్టులోకి తిరిగి వచ్చారు.
ఇప్పుడు సూపర్-8లో పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్ను ఫిబ్రవరి 24న ఇంగ్లాండ్తో ఆడనుంది. మరోవైపు ఫిబ్రవరి 25న న్యూజిలాండ్ జట్టు శ్రీలంకతో తలపడనుంది. రేపు అంటే ఫిబ్రవరి 22న సూపర్-8లో రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఒకవైపు భారత్-దక్షిణాఫ్రికా మధ్య పోరు జరగనుండగా, మరోవైపు ఇంగ్లాండ్- శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
