IIT Baba Prediction: ఎల్లుండి భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌.. పాక్ గెలుస్తుంద‌న్న ఐఐటీ బాబా!

ఐసీసీ టోర్నీలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే పోరు కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Published By: HashtagU Telugu Desk
IIT Baba Prediction

IIT Baba Prediction

IIT Baba Prediction: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌పై మహాకుంభమేళాలో వైరల్‌గా మారిన ఐఐటీ బాబా (IIT Baba Prediction) తాజాగా భారీ అంచనా వేశారు. అతని ఈ జోస్యం వివాదానికి దారితీసింది. సోషల్ మీడియా హ్యాండిల్ X లో ఒక వీడియో ఎక్కువగా వైరల్ అవుతోంది. దీనిలో బాబా భారతదేశ విజయం, ఓటమి గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఐఐటీ బాబా ప్ర‌కారం.. భారత్-పాక్ మ్యాచ్‌లో ఏ జ‌ట్టు గెలుస్తుందో చూద్దాం.

ఐసీసీ టోర్నీలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే పోరు కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొంత కాలంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాల కారణంగా ఇరు జట్లు ఐసీసీ టోర్నీల్లో మాత్రమే మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ICC టోర్నమెంట్‌లో ఫిబ్రవరి 23, 2025న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారతదేశం- పాకిస్తాన్ తలపడనున్నాయి. ఇదే సమయంలో మహా కుంభమేళా నుండి వెలుగులోకి వచ్చిన IIT బాబాగా ప్రసిద్ధి చెందిన అభయ్ సింగ్ మ్యాచ్ గురించి పెద్ద అంచనా వేశారు. ఆయన జోస్యం చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Hydra : ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? : హైడ్రా పై హైకోర్టు ఆగ్రహం

మ్యాచ్‌పై IIT బాబా అభయ్ సింగ్ అంచనా

ఐసీసీ టోర్నీలో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే గ్రేట్ మ్యాచ్‌లో ఈసారి పాకిస్థాన్ జట్టు గెలుస్తుందని యూట్యూబ్ ఛానెల్‌లో ఐఐటీయన్ బాబా అభయ్ సింగ్ అన్నారు. విరాట్‌ కోహ్లి ఇతర ఆటగాళ్లు ఎంతగా ప్రయత్నించినా భారత్‌ గెలవదని బాబా పేర్కొన్నారు. అతని ఈ వీడియోపై క్రికెట్ అభిమానులు తమ తమ స్పందనలను తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో అతన్ని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు కివీస్ జట్టు చేతిలో 60 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్ర‌స్తుతం ఐఐటీ బాబా అభయ్ సింగ్ జోస్యం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

  Last Updated: 21 Feb 2025, 01:02 PM IST