Suryakumar Yadav: సూర్య‌కుమార్‌, హారిస్ రౌఫ్‌కు షాకిచ్చిన ఐసీసీ!

టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫైనల్ మ్యాచ్‌లో ఫైటర్ జెట్ కూల్చివేసినట్లుగా సైగ చేశారు. ఈ కారణంగానే ఆయనకు కూడా ఒక డిమెరిట్ పాయింట్ ఇచ్చారు.

Published By: HashtagU Telugu Desk
Suryakumar Yadav

Suryakumar Yadav

Suryakumar Yadav: ఏసీసీ ఆసియా కప్ 2025లో భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అనేక వివాదాలు చోటుచేసుకున్నాయి. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) లీగ్ దశలో విజయం సాధించిన తర్వాత దానిని సైన్యానికి అంకితం చేశారు. దీంతో ఆగ్రహించిన పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై బోర్డు చర్య తీసుకుంది. ఐసీసీ చర్యల కారణంగా జస్ప్రీత్ బుమ్రా కూడా ఇబ్బందుల్లో పడగా.. ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తృటిలో తప్పించుకున్నారు.

సూర్యకుమార్ యాదవ్‌పై ఐసీసీ చర్య

ఆసియా కప్ 2025 లీగ్ దశలో విజయం సాధించిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీలో పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైనవారిని గుర్తుచేసుకున్నారు. విజయాన్ని సైన్యానికి అంకితం చేశారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఆగ్రహం వచ్చింది. వారు దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేశారు. అక్కడ సూర్యకుమార్ యాదవ్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ఈ కారణంగానే ఐసీసీ ఆయనపై 30 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించింది. 2 డిమెరిట్ పాయింట్లు ఇచ్చింది. దీనితో పాటు మ్యాచ్ తర్వాత సైగ చేసిన అర్ష్‌దీప్ సింగ్‌ను దోషిగా గుర్తించలేదు. అందుకే అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు.

Also Read: Road Accidents : రోడ్లు బాగుంటే ఎక్కువ ప్రమాదాలకు అవకాశం – ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

జస్ప్రీత్ బుమ్రాపై కూడా చర్య

టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫైనల్ మ్యాచ్‌లో ఫైటర్ జెట్ కూల్చివేసినట్లుగా సైగ చేశారు. ఈ కారణంగానే ఆయనకు కూడా ఒక డిమెరిట్ పాయింట్ ఇచ్చారు. అలాగే తుపాకీని సూచించిన సైగ చేసిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు కూడా 1 డిమెరిట్ పాయింట్ లభించింది. ఇక సూపర్ 4 మ్యాచ్ మరియు ఫైనల్‌లో పదేపదే ఫైటర్ జెట్ కూల్చివేసినట్లుగా సైగ చేసిన హారిస్ రౌఫ్‌కు రెండు మ్యాచ్‌లకు కలిపి 60 శాతం మ్యాచ్ ఫీజు కోత, 4 డిమెరిట్ పాయింట్లు లభించాయి. దీనితో పాటు ఐసీసీ అతనికి 2 మ్యాచ్‌ల నిషేధం కూడా విధించింది.

  Last Updated: 04 Nov 2025, 09:54 PM IST