Site icon HashtagU Telugu

ICC Champions Trophy: ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. టీమిండియా పాక్ వెళ్లే నిర్ణ‌యం జై షా చేతుల్లో లేదా..?

ICC Visit Pakistan

ICC Visit Pakistan

ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)కి ముందు ప‌లు ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. టోర్నీ తేదీ ఖరారైనప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటిస్తుందా లేదా అనేది ఇంకా ధృవీకరించబడలేదు. బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన జై షా ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటువంటి పరిస్థితిలో ఛాంపియన్స్ ట్రోఫీ సమస్యను పరిష్కరించడం పాక్‌కు క‌ష్టంగా మారే అవ‌కాశం ఉంది.

డిసెంబర్‌ 1 నుంచి ఐసీసీ చైర్మన్‌గా జై షా బాధ్యతలు చేపట్టనున్నారు. జై షా ఐసీసీ చైర్మన్ అయిన తర్వాత.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్లాలా వద్దా అనేది నిర్ణ‌యించ‌నున్నార‌ని ప‌లు నివేదిక‌లు పేర్కొన్నాయి. అయితే అది జై షా చేతుల్లో కూడా లేదని బీసీసీఐ అధికారి వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిపారు. జై షాకు కూడా ఇది చాలా కష్టమైన పని అని ఒక అధికారి చెప్పారు.

Also Read: Hydra Ranganath : హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌కు మ‌రో కీల‌క బాధ్య‌త‌..ఇక తగ్గేదేలే

BCCI అధికారి ‘InsideSports’తో మాట్లాడుతూ.. చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదు. మా స్టాండ్ స్పష్టంగా ఉంది. మేము ప్రభుత్వం చెప్పినట్లే చేస్తాము. ఇది జై షాకు కష్టమైన పని అని నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే అతను ఐసిసి చీఫ్‌గా ఉంటాడు. అయితే అతను ఆందోళనను అర్థం చేసుకున్నాడు. ఐసిసి చీఫ్‌గా అతను తన వైఖరిని మార్చుకోవలసి ఉంటుందని మేము ఆశిస్తున్నామని ఆ అధికారి తెలిపారు.

ఆ అధికారి ఇంకా మాట్లాడుతూ.. భారత్ లేకుండా టోర్నీని నిర్వహించడం ఐసీసీకి కష్టమవుతుంది. ఈ ఈవెంట్‌ను కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. ఇది క్రికెట్‌కు మంచిదే. కానీ వైఖరి స్పష్టంగా ఉంది. భారత్‌ను తటస్థ వేదికలకు అనుమతించమని మేము ఇప్పటికే ఐసిసిని కోరాము. పాకిస్తాన్‌తో టోర్నమెంట్‌ను నిర్వహించడానికి మేము మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చాలని కోరాము. ఒకవేళ మాకు భారత ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ లభించకపోతే టీమిండియా పాక్ వెళ్తుంద‌ని ఆ అధికారి స్ప‌ష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.