Site icon HashtagU Telugu

ICC Champions Trophy: దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్?

Champions Trophy Final

Champions Trophy Final

ICC Champions Trophy: 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)కి సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. టీమ్ ఇండియా కారణంగా పాకిస్థాన్ భారీ నష్టాలను చవిచూడవచ్చు. ఈసారి పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే భారత జట్టు టోర్నమెంట్‌లో పాక్‌లో నిర్వ‌హిస్తే పాల్గొంటుందా లేదా అనేది ఇంకా ధృవీకరించబడలేదు. ఈసారి ఆసియా కప్ మాదిరిగా రెండు దేశాల్లో టోర్నీ నిర్వహించేందుకు పీసీబీ ఏమాత్రం సిద్ధంగా లేదు. వచ్చే ఏడాది జరిగే ఈ మెగా ఈవెంట్‌లో రోహిత్ జ‌ట్టు పాల్గొనకపోతే.. భారత్ లేకుండానే ఈ టోర్నీ ఆడతామ‌ని పాకిస్థాన్ అంటుంది. పీసీబీ కూడా బీసీసీఐని ఒప్పించాలని ఐసీసీని కోరింది.

టీమిండియా ఫైన‌ల్‌కు వెళ్తే వేదిక మార్పు!

వాస్తవానికి ‘ది టెలిగ్రాఫ్’లో ఒక నివేదిక ప్రకారం.. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని ఆడటానికి అంగీకరించి, టోర్నమెంట్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించినట్లయితే అప్పుడు టైటిల్ మ్యాచ్‌ను లాహోర్‌కు బదులుగా దుబాయ్‌కి మార్చవచ్చు. అంటే పీసీబీ ఫైనల్ మ్యాచ్ హోస్టింగ్‌ను కోల్పోవచ్చు. నివేదిక ప్రకారం.. టీమిండియా అన్ని మ్యాచ్‌లను పాకిస్తాన్‌కు బదులుగా వేరే వేదికకు మార్చాల్సి ఉంటుంది.

Also Read: Samantha : తెలుగు వారి ప్రేమ వల్లే ఈరోజు ఇంతగా ఎదిగాను – సమంత

అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇరు దేశాల రాజకీయ సంబంధాల కారణంగా టీమిండియా 16 సంవత్సరాలుగా పాకిస్తాన్‌లో పర్యటించలేదని మ‌న‌కు తెలిసిందే. భారత జట్టు చివరిసారిగా 2008లో పాకిస్థాన్‌లో ప‌ర్య‌టించింది.

పీసీబీ మొండిగా ఉంది

అయితే ఈసారి టోర్నీని మరెక్కడా నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సిద్ధంగా లేదు. తాజాగా పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రకటన వెలువడింది. భారత జట్టు పాకిస్థాన్‌కు రావాల్సి ఉంటుందని నఖ్వీ స్ప‌ష్టంగా చెప్పాడు. అన్ని జట్ల సమక్షంలో పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడంలో విజయం సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. మరోవైపు టీమిండియా పాక్ వెళ్లే విషయంలో ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుండగా, టోర్నీ చివరి మ్యాచ్ మార్చి 15న జరగనుంది.