ICC Bans All Rounder : స్టార్ ఆల్ రౌండ‌ర్‌కు షాక్‌.. రెండేళ్ల పాటు ఐసీసీ బ్యాన్

ICC Bans All Rounder : బంగ్లాదేశ్‌కు చెందిన ఓ స్టార్ క్రికెటర్ (ICC Bans All Rounder)పై ఐసీసీ రెండేళ్ల పాటు నిషేధం విధించింది.

  • Written By:
  • Publish Date - January 16, 2024 / 08:30 PM IST

ICC Bans All Rounder : బంగ్లాదేశ్‌కు చెందిన ఓ స్టార్ క్రికెటర్ (ICC Bans All Rounder)పై ఐసీసీ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. బ్యాన్ బారిన పడిన ఈ ఆటగాడు దేశం తరఫున 100కిపైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రికెటర్‌ను సెప్టెంబర్ 2023లో ICC నిందితుడిగా గుర్తించింది. ఇప్పుడు ఈ ఆల్ రౌండర్ పై మూడు ఆరోపణలు రుజువయ్యాయి. ఈ ఆరోపణలతో ఐసీసీ అతడిపై రెండేళ్లపాటు నిషేధం విధించింది. ఆరోపణలన్నింటినీ అంగీకరించిన ఆ  క్రికెటర్ పేరు నాసిర్ హుస్సేన్. అత‌నిపై ఈ నిషేధం ఏప్రిల్ 7, 2025 వరకు అమలులో ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

విష‌యం ఏమిటి..?

నిజానికి బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ నాసిర్ హుస్సేన్‌కు గుర్తు తెలియని వ్యక్తి బహుమతి ఇచ్చాడు. ఇందుకోసం ఆయనకు ప్రత్యేక డిమాండ్ కూడా చేశారు. అతను ఈ సమాచారాన్ని బోర్డుకు లేదా అవినీతి నిరోధక అధికారికి ఇవ్వలేదు. ఆ తర్వాత విచారణ జరిగినా అధికారులకు సహకరించలేదు. అందుకే ఇప్పుడు రెండేళ్ల పాటు నిషేధానికి గురయ్యాడు.

నాసిర్ హుస్సేన్‌పై 3 ఆరోపణలు

  • ఆర్టికల్ 2.4.3 ఉల్లంఘన – ఐఫోన్ 12 రూపంలో నాసిర్‌కు US$ 750 కంటే ఎక్కువ విలువైన బహుమతి ఇవ్వబడింది. ఈ విషయాన్ని ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారికి తెలియజేయలేదు.
  • ఆర్టికల్ 2.4.4 ఉల్లంఘన – నాసిర్ ఏదైనా తెలియని వ్యక్తి సంప్రదించినట్లు అవినీతి నిరోధక అధికారికి తెలియజేయలేదు. ఇది కాకుండా అవినీతికి సంబంధించిన కార్యకలాపాల కోసం ఏదైనా ఆహ్వానాన్ని అంగీకరించడం, దాని గురించి అధికారికి తెలియజేయకపోవడంలో కూడా అతను దోషిగా తేలాడు.
  • ఆర్టికల్ 2.4.6 ఉల్లంఘన- ఈ కేసును అవినీతి నిరోధక అధికారి దర్యాప్తు చేస్తున్నప్పుడు నాసిర్ అతనికి సహకరించలేదు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వారికి ఇవ్వడంలో కూడా అతను విఫలమయ్యాడు. దీనికి సంబంధించిన ఎలాంటి పత్రాలు కూడా అధికారికి ఇవ్వలేదు.

Also Read: Direct To Mobile : డైరెక్ట్ టు మొబైల్.. ఇంటర్నెట్​ లేకుండానే లైవ్​ టీవీ, ఓటీటీ

రన్ మిషన్, కింగ్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. ఇప్పటికే క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రికార్డులు నెలకొల్పితూ.. దిగ్గజ క్రికెటర్ల రికార్డులను బద్దలు కొట్టాడు. ఇదే క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ లో మరో అరుదైన రికార్డును సృష్టించాడు. మూడు టీ20ల సిరిస్ లో భాగంగా అఫ్గానిస్థాన్ తో జరిగిన రెండో మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. యశస్వి జైస్వాల్, శివం దూబే మెరుపు ఇన్నింగ్స్ తో ఆఫ్ఘ‌న్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ‌టంతో టీమిండియా 15.4 ఓవర్లలో 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అయితే, 14 నెలల తర్వాత టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో 16 బంతుల్లో 29 పరుగులు చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో ఐదు ఫోర్లు కూడా బాదాడు. ఈ క్ర‌మంలోనే కింగ్ కోహ్లీ మ‌రో అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.