Rohit Sharma On Virat: విరాట్ కోహ్లీ ఫామ్‌పై తొలిసారి స్పందించిన రోహిత్ శ‌ర్మ‌.. ఏమ‌న్నాడో తెలుసా..?

Rohit Sharma On Virat: సెమీఫైనల్ రెండో మ్యాచ్ భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. జూన్ 29న జరిగే ఫైనల్లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఫైనల్ కు ముందు విరాట్ కోహ్లి పేలవ ఫామ్ టీమ్ ఇండియాకు మరోసారి ఆందోళన కలిగించే అంశంగా మారింది. సెమీఫైనల్లో కోహ్లీపై రోహిత్ అండ్ టీమ్ అంచనాలు పెట్టుకున్నప్పటికీ విరాట్ మరోసారి అందరినీ నిరాశపరిచాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ.. […]

Published By: HashtagU Telugu Desk
Virat Kohli- Rohit Sharma

Virat Kohli- Rohit Sharma

Rohit Sharma On Virat: సెమీఫైనల్ రెండో మ్యాచ్ భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. జూన్ 29న జరిగే ఫైనల్లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఫైనల్ కు ముందు విరాట్ కోహ్లి పేలవ ఫామ్ టీమ్ ఇండియాకు మరోసారి ఆందోళన కలిగించే అంశంగా మారింది. సెమీఫైనల్లో కోహ్లీపై రోహిత్ అండ్ టీమ్ అంచనాలు పెట్టుకున్నప్పటికీ విరాట్ మరోసారి అందరినీ నిరాశపరిచాడు. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీ ఫామ్‌ (Rohit Sharma on Virat)పై ఓ కీల‌క ప్రకటన చేశాడు.

ఈ ప్రపంచకప్‌లో విరాట్‌ ఫ్లాప్ నిరాశ‌ప‌రిచాడు

2024 టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో కోహ్లి ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. ఈ ప్రపంచకప్‌లో కోహ్లీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు కోహ్లీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ 9 పరుగులు చేశాడు.

Also Read: Rohit Sharma Cries: ఇంగ్లండ్‌ను ఓడించిన భార‌త్‌.. ఎమోష‌న‌ల్ అయిన రోహిత్ శ‌ర్మ‌..!

అయితే ఈ మ్యాచ్ తర్వాత విరాట్ ఫామ్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘విరాట్ క్వాలిటీ ప్లేయర్. 15 ఏళ్లుగా భారత్ తరఫున ఆడుతున్నారు. ఫామ్ అనేది అతడికి సమస్యే కాదు. పెద్ద మ్యాచుల్లో కోహ్లీ ఎంత ముఖ్యమో మాకు తెలుసు. అతడి ఇంటెంట్ బాగుంది. ఫైనల్ కోసం రన్స్ సేవ్ చేసుకుంటున్నాడేమో..’ అని నవ్వుతూ చెప్పారు.

We’re now on WhatsApp : Click to Join

భార‌త్‌ ఫైనల్‌కు చేరుకుంది

సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 68 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. దీంతో 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమికి భారత్ కూడా ప్రతీకారం తీర్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 171 పరుగులు చేసింది. త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 103 పరుగులకే ఆలౌటైంది. టీమ్ ఇండియా బౌలర్లు మరోసారి ప్రమాదకరమైన బౌలింగ్‌ను ప్రదర్శించారు. కుల్దీప్, అక్షర్ మూడేసి వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీశాడు.

  Last Updated: 28 Jun 2024, 10:01 AM IST