HCA- BCCI: ప్రపంచ కప్ 2023 (ODI World Cup- 2023) కొన్ని మ్యాచ్ల తేదీలు ఇటీవల మార్చబడ్డాయి. అహ్మదాబాద్, కోల్కతాలో జరగాల్సిన మ్యాచ్ల తేదీలను మార్చారు. పండుగల కారణంగా ఈ రెండు ప్రాంతాల్లోనూ మార్పు వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో జరిగే మ్యాచ్ల తేదీని కూడా మార్చవచ్చు. అక్టోబర్ 9, 10 తేదీల్లో హైదరాబాద్లో వరుసగా రెండు మ్యాచ్లు జరగనున్నాయి. ఈ విషయమై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాతో మాట్లాడింది.
అక్టోబర్ 9న హైదరాబాద్లో న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత అక్టోబర్ 10న పాకిస్థాన్, శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తల ప్రకారం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ (HCA- BCCI)కి లేఖ రాసింది. ఈ రెండు మ్యాచ్ల మధ్య సమయం కావాలని అసోసియేషన్ కోరింది. భద్రతా ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని తేదీని మార్చాలని అంటున్నారు.
Also Read: UAE vs NZ: చరిత్ర సృష్టించిన యూఏఈ.. న్యూజిలాండ్ను చిత్తు చిత్తుగా ఓడించి..!
నివేదికల ప్రకారం.. హైదరాబాద్ పోలీసులు వరుసగా రెండు మ్యాచ్లలో భద్రతా ఏర్పాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు కూడా హైదరాబాద్లో మ్యాచ్లు ఆడనుంది. అందువల్ల ఈ మ్యాచ్కు సంబంధించి భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. హైదరాబాద్లో మొత్తం మూడు మ్యాచ్లు జరగాల్సి ఉంది. అక్టోబర్ 6న పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత రెండో మ్యాచ్ అక్టోబర్ 9న జరగనుంది. ఇక మూడో మ్యాచ్ అక్టోబర్ 10న జరగనుంది. అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అందుకే ఈ మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కూడా సమయం కోరింది.
ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య అహ్మదాబాద్లో జరగనుంది. నవంబర్ 15న టోర్నీ తొలి సెమీఫైనల్ జరగనుంది. కాగా రెండో సెమీఫైనల్ నవంబర్ 16న జరగనుంది. టోర్నీ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్లో జరగనుంది.