Team India Captain: జులై 27 నుంచి భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. దీని కోసం నేడు టీమ్ ఇండియాను (Team India Captain) ప్రకటించే అవకాశం ఉంది. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు శ్రీలంకపై కొత్త కెప్టెన్, కొత్త జట్టు ఏర్పడబోతోంది. మరోవైపు టీ20 జట్టు కెప్టెన్పై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. మీడియా కథనాల ప్రకారం శ్రీలంకతో టీ20 సిరీస్లో హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించవచ్చు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా చేయాలని కోరుతున్నాడు. ఇంతకుముందు కూడా ఈ ఇద్దరు ఆటగాళ్లు టీ20 ఇంటర్నేషనల్లో టీమ్ ఇండియాకు కెప్టెన్గా వ్యవహరించారు.
Also Read: YCP Activist Murdered: నడిరోడ్డుపై వైసీపీ కార్యకర్త దారుణ హత్య.. రాష్ట్రపతికి ఫిర్యాదు..!
కెప్టెన్గా హార్దిక్ గణాంకాలు
IPL 2024లో తొలిసారిగా హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ తీసుకున్నాడు. హార్దిక్ ఈ సీజన్ను ఎప్పటికీ మరచిపోలేడు. కెప్టెన్గా హార్దిక్కి ఈ సీజన్ చాలా బ్యాడ్గా మారింది. అంతకుముందు హార్దిక్ 2022 సంవత్సరంలో మొదటిసారి గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా నియమితుడయ్యాడు. పాండ్యా అతని కెప్టెన్సీలో జట్టును IPL టైటిల్ అందించిన విషయం తెలిసిందే. దీని తర్వాత పాండ్యా నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ 2023 సంవత్సరంలో వరుసగా రెండవసారి ఫైనల్స్కు చేరుకుంది. రన్నరప్గా నిలిచింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో హార్దిక్ కెప్టెన్గా ఇప్పటి వరకు 16 మ్యాచ్లు ఆడగా, అందులో టీమ్ 10 గెలిచి 5 ఓడింది. ఈ కాలంలో హార్దిక్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా విజయాల శాతం 65 శాతానికి పైగా ఉంది.
కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ గణాంకాలు
టీ20 క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. అంతేకాకుండా టీ20 అంతర్జాతీయ క్రికెట్లో కూడా సూర్య టీమ్ ఇండియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత జట్టు 7 మ్యాచ్లు ఆడగా, అందులో టీమ్ ఇండియా 5 గెలిచి 2 ఓడింది. ఈ క్రమంలో సూర్య కెప్టెన్సీలో టీమిండియా విజయ శాతం 71.42గా ఉంది. ఈ లెక్కలు చూస్తుంటే టీ20లో హార్దిక్, సూర్య ఇద్దరూ బెటర్ కెప్టెన్స్ అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు శ్రీలంకపై ఈ ఇద్దరిలో ఎవరికి నాయకత్వం దక్కుతుందో చూడాలి.
We’re now on WhatsApp. Click to Join.