Site icon HashtagU Telugu

Shubman Gill: గుజ‌రాత్ టైటాన్స్ ఎందుకు ఓడిపోయింది?.. గిల్ స‌మాధానం ఇదే!

Shubman Gill

Shubman Gill

Shubman Gill: ముంబై ఇండియన్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య ఉత్కంఠభరిత ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై గుజరాత్‌ను 20 పరుగుల తేడాతో ఓడించింది. ఇదిలా ఉండగా.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) మ్యాచ్‌లో ఓటమికి గల కారణాల గురించి వెల్ల‌డించాడు. ఓటమి కారణాల గురించి శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఒక మ్యాచ్‌లో వరుసగా మూడు క్యాచ్‌లు వదిలేయడం వల్ల బౌలర్లకు ఫీల్డింగ్ నుండి సహాయం అందదని, దీని వల్ల బౌలర్లకు ఆటను తమ నియంత్రణలో ఉంచుకోవడం కష్టమవుతుందని చెప్పాడు.

శుభ్‌మన్ గిల్ వెల్లడి

గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమిపై మాట్లాడుతూ.. ఈ రోజు క్రికెట్‌లో అద్భుతమైన ఆట జరిగింది. మేము మెరుగైన మ్యాచ్ ఆడాము. ఈ రోజు మ్యాచ్‌లో చివరి 3-4 ఓవర్లు మా పక్షంలో లేవు. కానీ ఇది ఒక అద్భుతమైన మ్యాచ్ అని గిల్ చెప్పాడు. ఓటమి కారణాల గురించి మాట్లాడుతూ.. “మూడు క్యాచ్‌లు వదిలేసిన తర్వాత బౌలర్లకు ఆటను నియంత్రణలో ఉంచడం సులభం కాదు” అని అన్నాడు.

Also Read: Colombia : ఫలించిన భారత్‌ దౌత్యం..ఉగ్రవాదంపై భారత్ వైఖరికి కొలంబియా సంపూర్ణ మద్దతు

శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మేము బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మా ముందు ఉన్న ఏకైక ఆలోచన ఏమిటంటే మేము ఆడాలనుకున్న ఆటను మాత్రమే ఆడాలి. సాయి, వాషింగ్టన్‌కు కూడా అదే చెప్పాము. ఆ ఇద్దరు ఆటగాళ్లకు కూడా ఒకే లక్ష్యం ఉంది. అది ఈ మ్యాచ్‌ను గెలవడం అని పేర్కొన్నాడు. గిల్ మరింత మాట్లాడుతూ.. ఈ ప్రయాణంలో అందరు ఆటగాళ్లకు క్రెడిట్ ఇవ్వాలి. ముఖ్యంగా సాయి సుదర్శన్‌కు. సాయి ఈ సీజన్‌లో గుజరాత్ కోసం చాలా బాగా ఆడాడు. ఈ పిచ్‌పై 210 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేయడం సరైనదని గిల్ తెలిపాడు.

క్వాలిఫయర్-2లోకి ముంబై

ముంబై ఇండియన్స్ ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌ను ఓడించ‌డంతో క్వాలిఫయర్-2లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా జ‌ట్టు ముంబై ఇండియన్స్.. శ్రేయస్ అయ్యర్ టీమ్ పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ముంబై, పంజాబ్‌లలో ఈ మ్యాచ్‌ను గెలిచిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.