Gautam Adani: ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న అదానీ.. ఆ జ‌ట్టుపై క‌న్ను..!

గౌత‌మ్ అదానీ (Gautam Adani) ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఐపీఎల్‌లో అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టుకు యజమాని.

Published By: HashtagU Telugu Desk
Adani Group

Adani Group

Gautam Adani: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ఫ్రాంచైజీ. ఈ గేమ్‌లో వివిధ దేశాల ఆట‌గాళ్లు పాల్గొంటున్నారు. అదే సమయంలో పిచ్‌పై తమ అభిమాన క్రికెటర్ ఫోర్లు, సిక్స్‌లు కొట్టడాన్ని కూడా అభిమానులు చూడాలనుకుంటున్నారు. అయితే వ‌చ్చే ఐపీఎల్ చాలా ఆసక్తికరంగా సాగనుంది. ఈసారి ఐపీఎల్‌లో ఆటగాళ్లతో పాటు దేశంలోని ఇద్దరు బడా వ్యాపారవేత్తల మధ్య పోటీ కూడా మ‌నం చూసే అవ‌కాశం ఉంది.

ఐపీఎల్‌లో గౌతమ్ అదానీ ఎంట్రీ

కొన్ని నివేదికల ప్ర‌కారం.. గౌత‌మ్ అదానీ (Gautam Adani) ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఐపీఎల్‌లో అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టుకు యజమాని. ఇలాంటి పరిస్థితుల్లో గౌతమ్ అదానీ కూడా ఐపీఎల్‌లోకి అడుగుపెట్టవచ్చని వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్‌లోని ప్రముఖ జట్లలో ఒకటైన గుజరాత్ టైటాన్స్ యాజమాన్య హక్కులు త్వరలో అదానీ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.

Also Read: Microsoft Outage Hits Airports: మైక్రోసాఫ్ట్ సేవల్లో లోపం.. ఎయిర్‌లైన్స్‌కు భారీగా లాస్‌..!

అసలు విషయం ఏమిటంటే?

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) లాగిన్ వ్యవధి ఫిబ్రవరి 2025లో ముగుస్తుంది. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ షేర్లలో చాలా వరకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ CVC వద్ద ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం.. లాక్-ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత CVC తన షేర్లను విక్రయించడానికి సిద్ధమవుతోంది. అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ గుజరాత్ టైటాన్స్ యాజమాన్య హక్కులను కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

గుజరాత్ టైటాన్స్ విలువ

మూడేళ్ల క్రితం కొత్త జట్టుగా ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ విలువ 1 బిలియన్ డాలర్లు. CVC గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీని 2021లో రూ. 5,625 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో అదానీ గ్రూప్ ఈ గొప్ప IPL ఫ్రాంచైజీని కొనుగోలు చేయలేకపోయింది. అయితే ఇప్పుడు అత్యధిక వాటాలను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్, టొరంటో మధ్య పోటీ నెలకొంది. అదే సమయంలో షేర్లను విక్రయించడానికి CVCకి ఇది ఉత్తమ అవకాశం. CVC ప్రధాన కార్యాలయం లక్సెంబర్గ్‌లో ఉండగా, అదానీ.. టొరంటో గ్రూప్‌ల ప్రధాన కార్యాలయం అహ్మదాబాద్‌లో ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్ టైటాన్స్ యాజమాన్య హక్కులు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు సీవీసీ, అదానీ గ్రూప్, టొరంటో సున్నితంగా నిరాకరించాయి.

  Last Updated: 20 Jul 2024, 12:14 AM IST