Site icon HashtagU Telugu

Indian Cricket Team: 27 ఏళ్లుగా భార‌త్‌దే పైచేయి.. కానీ ఈసారి సీన్ రివ‌ర్స్‌..!

Team India

Team India

Indian Cricket Team: ప్ర‌స్తుతం భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లోని రెండో మ్యాచ్ ఆగస్టు 4న కొలంబోలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా (Indian Cricket Team) 32 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో వన్డే సిరీస్‌ కైవసం చేసుకోవాలన్న టీమిండియా కల కూడా చెదిరిపోయింది. ఇక ఇక్కడి నుంచి టీమ్ ఇండియా సిరీస్‌ని సమం చేయ‌ట‌మే ఏకైక మార్గం. ఎందుకంటే సిరీస్‌లో తొలి మ్యాచ్ టై కాగా, రెండో మ్యాచ్‌లో శ్రీలంక గెలిచి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

27 ఏళ్ల రికార్డుకు బ్రేక్‌

భారత జట్టు గత 27 ఏళ్లుగా శ్రీలంకతో వన్డే ద్వైపాక్షిక సిరీస్‌లను నిరంతరం కైవసం చేసుకుంటోంది. అయితే ఇప్పుడు 27 ఏళ్లుగా కొనసాగుతున్న టీమిండియా రికార్డుకు బ్రేక్ ప‌డింది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ సిరీస్‌ను టీమిండియా గెలవదు. సిరీస్‌లో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. అందులోనూ టీమ్ ఇండియా గెలిస్తే సిరీస్‌ను 1-1తో సమం చేస్తుంది. భారత జట్టు చివరిసారిగా 1997లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. ఆ సిరీస్‌లో టీమిండియా కమాండ్ మాజీ గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ చేతిలో ఉంది. ఈ సిరీస్‌ను శ్రీలంక 3-0తో కైవసం చేసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 11 వన్డే సిరీస్‌లు జరగ్గా వాటన్నింటిని టీమ్ ఇండియా గెలుచుకుంది.

Also Read: Djokovic Beats Alcaraz: క‌ల నెర‌వేర్చుకున్న జ‌కోవిచ్‌.. ఒలింపిక్స్‌లో గోల్ట్ మెడ‌ల్ సాధించాడు..!

రెండో మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో ఓడిపోయింది

సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో టీమిండియా పేలవ బ్యాటింగ్ మరోసారి కనిపించింది. రోహిత్ శర్మ మినహా మిగతా బ్యాట్స్‌మెన్లు నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాకు 241 పరుగుల విజయ లక్ష్యం ఉండగా, భారత జట్టు మొత్తం 208 పరుగులకే కుప్పకూలింది.

We’re now on WhatsApp. Click to Join.

భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ పర్యటనతో టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఇటీవ‌ల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న టీమిండియా అద్భుత ఆటతీరును ప్రదర్శించగా.. ఇప్పుడు వన్డే సిరీస్‌లో కథ మారింది. ODI సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, KL రాహుల్, అయ్యర్ వంటి దిగ్గజాలు తిరిగి వచ్చినప్పటికీ జట్టు విజయం కోసం తహతహలాడుతోంది.