IPL 2024: ధోనీ కంటే ఫాస్ట్ బౌలర్ బెటర్.. హర్భజన్ షాకింగ్ కామెంట్స్

  • Written By:
  • Publish Date - May 6, 2024 / 05:22 PM IST

IPL 2024:  ధోనీ ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. సాధారణంగా మ్యాచ్ చివరి 1-2 ఓవర్లలో బ్యాటింగ్‌కు వస్తాడు. కానీ ఐపీఎల్ 2024 53వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టాడు.

MS ధోన్ మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్‌లకు తనకంటే ముందు బ్యాటింగ్ చేయడానికి అవకాశం ఇచ్చాడు. 19వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. పిచ్‌పైకి వచ్చిన వెంటనే హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ధోనీ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. హర్భజన్ సింగ్ మాట్లాడుతూ “ఎంఎస్ ధోని 9వ నంబర్‌లో బ్యాటింగ్ చేయాలనుకుంటే అతను ఆడకూడదు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్‌ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. అతను జట్టు నిర్ణయాధికారుడు. త్వరగా బ్యాటింగ్‌కు రాకుండా జట్టును నిరాశపరిచాడు.

శార్దూల్ ఠాకూర్ అతని కంటే ముందు బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ధోనీలా ఠాకూర్ ఎప్పుడూ సిక్సర్లు కొట్టలేడు, ధోనీ ఎందుకు ఈ తప్పు చేశాడో అర్థం కావడం లేదు. చెన్నై సూపర్ కింగ్స్‌కు వేగవంతమైన పరుగులు అవసరం. ధోనీ మునుపటి మ్యాచ్‌లలో కూడా అదే చేశాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ముఖ్యమైన మ్యాచ్‌లో అతను ఆలస్యంగా బ్యాటింగ్‌కు రావడం ఆశ్చర్యం కలిగించింది” అని సింగ్ అన్నాడు.