April 18: ఐపీఎల్లో ఏప్రిల్ 18 (April 18) బ్యాడ్ ఫేజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని వెంటాడుతునే ఉంది. ఏప్రిల్ 18న ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. సీజన్-18లో ఆర్సీబీకి ఇది సొంత మైదానంలో వరుసగా మూడో ఓటమి. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా విఫలమయ్యాడు.
మళ్లీ ఏప్రిల్ 18న విరాట్, ఆర్సీబీ దారుణ ప్రదర్శన
ఐపీఎల్ ఏప్రిల్ 18, 2008న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కాతా నైట్ రైడర్స్ మధ్య ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ కేకేఆర్ చేతిలో 144 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఆ సమయంలో ఆర్సీబీ జట్టు 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 82 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా విఫలమై, అతని బ్యాట్ నుండి కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. ఇప్పుడు మరోసారి ఐపీఎల్లో ఏప్రిల్ 18న ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఓటమి చవిచూసింది.కోహ్లీ కూడా 1 పరుగు చేసి ఔట్ అయ్యాడు.
Aloso Read: Azharuddin: టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్కు బిగ్ షాక్
ఆర్సీబీ కేవలం 95 పరుగులు మాత్రమే చేసింది
వర్షంతో అంతరాయం ఏర్పడిన మ్యాచ్లో ఆర్సీబీ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తూ 14 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. ఆర్సీబీ తరపున బ్యాటింగ్ చేసిన టిమ్ డేవిడ్ అత్యధికంగా 50 పరుగులతో నాటౌట్ ఇన్నింగ్స్ ఆడాడు. దీని కారణంగా అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ 96 పరుగుల లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సాధించింది. పంజాబ్ తరపున బ్యాటింగ్ చేసిన నేహల్ వఢేరా అత్యధికంగా 33 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ తరపున బౌలింగ్ చేసిన జోష్ హాజిల్వుడ్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది మూడో ఓటమి.