India vs England:కోహ్లీ, పాండ్యా హాఫ్ సెంచరీలు.. ఇంగ్లాంట్ టార్గెట్ 169

అడిలైడ్ వేదికగా జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్‌కప్ సెమీఫైనల్లో టీమిండియా 169 పరుగుల టార్గెట్‌ ను ఇంగ్లాండ్ ముందుంచుంది.

  • Written By:
  • Updated On - November 10, 2022 / 04:12 PM IST

అడిలైడ్ వేదికగా జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్‌కప్ సెమీఫైనల్లో టీమిండియా 169 పరుగుల టార్గెట్‌ ను ఇంగ్లాండ్ ముందుంచుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ త్వరగానే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. రాహుల్ 5 , రోహిత్ శర్మ 27 పరుగులకు ఔటయ్యారు. ఫామ్‌లో ఉన్న కోహ్లీ మరోసారి ఆదుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచినా…పాండ్యాతో కలిసి 61 పరుగులు జోడించాడు. విరాట్ 39 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. కోహ్లీకి ఈ ప్రపంచకప్‌లో ఇది నాలుగో హాఫ్ సెంచరీ. అలాగే అంతర్జాతీయ టీ ట్వంటీల్లో విరాట్ 4 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. అటు పాండ్యా కూడా మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. పంత్ 6 రన్స్ చేసి ఔటైనప్పటకీ… పాండ్యాకు స్ట్రైకింగ్ ఇచ్చే ఉద్ధేశంతో తన వికెట్‌ త్యాగం చేసాడు. పాండ్యా జోరుకు భారత్ చివరి 5 ఓవర్లలో 68 పరుగులు చేసింది.
దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. పాండ్యా 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేయగా.. కోహ్లీ 40 హంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 50 రన్స్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 , రషీద్ 1 , క్రిస్ వోక్స్ 1 వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత్ వికెట్ కీపర్‌గా పంత్‌నే కొనసాగించింది. అటు ఇంగ్లాండ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. డేవిడ్ మలాన్, మార్క్ వుడ్ దూరమవడంతో క్రిస్ జోర్డాన్, ఫిల్ సాల్ట్ జట్టులోకి వచ్చారు.