Site icon HashtagU Telugu

India First T20 Match: టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడింది ఎప్పుడో తెలుసా..? ఆ మ్యాచ్ లో గెలిచిందెవరంటే..?

India First T20 Match

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

India First T20 Match: టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం తొలి మ్యాచ్ జరగనుంది. టీమ్ ఇండియాకు ఇది 200వ టీ20 మ్యాచ్. ఇంతకు ముందు భారత్ 199 మ్యాచ్‌లు ఆడింది. 2006లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టీ20 (India First T20 Match) మ్యాచ్‌ ఆడింది. వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. కేవలం 1 బంతి మిగిలి ఉండగానే భారత్‌ విజయం సాధించింది. టీమ్ ఇండియాలో దినేష్ మోంగియా, దినేష్ కార్తీక్ కీలక పాత్ర పోషించారు. బౌలింగ్‌లో జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్ అద్భుతాలు చేశారు.

తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఉత్కంఠ విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 21 బంతుల్లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను 3 ఫోర్లు కొట్టాడు. హెర్షెల్ గిబ్స్ 7 బంతుల్లో 7 పరుగులు చేసి అవుటయ్యాడు. ఏబీ డివిలియర్స్ కూడా 4 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అల్బీ మోర్కెల్ 18 బంతుల్లో 27 పరుగులు చేశాడు.

Also Read: 200th T20I Match: 200వ టీ20 మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. శ్రీలంకతో అత్యధిక టీ20 మ్యాచ్‌లు..!

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో భారత్ తరఫున జహీర్, అజిత్ అగార్కర్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. జహీర్ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అగార్కర్ 2.3 ఓవర్లలో 10 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మెయిడిన్ ఓవర్ కూడా వేశాడు. శ్రీశాంత్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. సచిన్ టెండూల్కర్, హర్భజన్ సింగ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. హర్భజన్ 3 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చాడు.

దక్షిణాఫ్రికా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దినేశ్ మోంగియా, కార్తీక్‌లు భారత్‌ తరఫున మంచి ప్రదర్శన చేశారు. మోంగియా 45 బంతుల్లో 38 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. కార్తీక్ 28 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. సురేశ్ రైనా 3 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనీ సున్నాతో ఔటయ్యాడు. దీంతో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.