Divya Deshmukh: ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్‌.. ఆమెకు ప్రైజ్‌మ‌నీ ఎంతంటే?

నాగపూర్‌కు చెందిన దివ్యా దేశ్‌ముఖ్ చెస్ వరల్డ్ కప్‌ను గెలుచుకొని ప్రపంచ వేదికపై భారతదేశ ఖ్యాతిని చాటింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన దివ్యాకు దాదాపు రూ. 42 లక్షల ప్రైజ్ మనీ లభించింది.

Published By: HashtagU Telugu Desk
Divya Deshmukh

Divya Deshmukh

Divya Deshmukh: భారతదేశానికి చెందిన యువ సంచలనం దివ్యా దేశ్‌ముఖ్ (Divya Deshmukh) FIDE చెస్ వరల్డ్ కప్ టైటిల్‌ను గెలుచుకొని ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. 19 ఏళ్ల దివ్యా ఫైనల్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీని ఓడించి ఈ ఘనత సాధించింది. విజయం అనంతరం దివ్యా దేశ్‌ముఖ్ భావోద్వేగానికి లోనై, ఆనంద బాష్పాలను ఆపుకోలేకపోయింది.

ఈ చెస్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జార్జియాలోని బాటుమీలో జరిగింది. శనివారం, ఆదివారం జరిగిన దివ్యా దేశ్‌ముఖ్, కోనేరు హంపీ మధ్య క్లాసికల్ మ్యాచ్‌లు 1-1తో డ్రా అయ్యాయి. దీంతో విజేతను నిర్ణయించడానికి రాపిడ్ రౌండ్ అవసరం కాగా.. నేడు జరిగిన రాపిడ్ రౌండ్‌లో దివ్యా దేశ్‌ముఖ్ కోనేరు హంపీని ఓడించి తన మొదటి చెస్ వరల్డ్ కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Also Read: Nagababu : వైసీపీని, ఆ పార్టీ నేతలను ఏమనాలో అర్థంకావడంలేదు

ఫైనల్‌లో ఇద్దరు భారతీయులే!

FIDE చెస్ వరల్డ్ కప్ ఫైనల్‌కు ఇద్దరు భారతీయ ఆటగాళ్లు చేరుకోవడం దేశానికి నిజంగా గర్వకారణం. సెమీఫైనల్ మ్యాచ్‌లో దివ్యా దేశ్‌ముఖ్ చైనాకు చెందిన టాన్ జాంగ్యీని ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన మొదటి భారతీయ మహిళగా దివ్యా దేశ్‌ముఖ్ చరిత్ర సృష్టించింది. అదే విధంగా గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీ కూడా సెమీఫైనల్‌లో చైనాకు చెందిన టింగ్జీ లీని ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఇద్దరు భారతీయ పుత్రికలు చైనా ఆటగాళ్లను వెనక్కి నెట్టి ఫైనల్‌కు చేరడంతో, ఈసారి వుమెన్స్ చెస్ వరల్డ్ కప్ టైటిల్ భారత్‌కు రావడం ఖాయమని నిరూపితమైంది.

దివ్యా దేశ్‌ముఖ్‌కు ప్రైజ్ మనీ

నాగపూర్‌కు చెందిన దివ్యా దేశ్‌ముఖ్ చెస్ వరల్డ్ కప్‌ను గెలుచుకొని ప్రపంచ వేదికపై భారతదేశ ఖ్యాతిని చాటింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన దివ్యాకు దాదాపు రూ. 42 లక్షల ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్‌గా నిలిచిన కోనేరు హంపీకి రూ. 30 లక్షల ప్రైజ్ మనీ లభించింది. ఇది భారత చెస్ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా నిలిచిపోతుంది.

  Last Updated: 28 Jul 2025, 06:30 PM IST