Commonweath Games : కామన్ వెల్త్ గేమ్స్…క్రికెట్ లో గోల్డ్ మెడల్ ఎవరిదో ?

కామన్ వెల్త్ గేమ్స్ లో ఈ సారి అందరినీ ఆకర్షస్తోన్న ఈవెంట్ క్రికెట్...చాలా కాలం తర్వాత ఈ మెగా ఈవెంట్ లో క్రికెట్ కు ఎంట్రీ దక్కింది. అయితే ఈ సారి మహిళల క్రికెట్ కు అవకాశం ఇచ్చారు.దాదాపు 24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. 1998 కౌలాలంపూర్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల వన్డే క్రికెట్‌ టోర్నీను నిర్వహించారు.

  • Written By:
  • Publish Date - July 28, 2022 / 11:55 AM IST

కామన్ వెల్త్ గేమ్స్ లో ఈ సారి అందరినీ ఆకర్షస్తోన్న ఈవెంట్ క్రికెట్…చాలా కాలం తర్వాత ఈ మెగా ఈవెంట్ లో క్రికెట్ కు ఎంట్రీ దక్కింది. అయితే ఈ సారి మహిళల క్రికెట్ కు అవకాశం ఇచ్చారు.దాదాపు 24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ పోటీలు జరగనున్నాయి. 1998 కౌలాలంపూర్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల వన్డే క్రికెట్‌ టోర్నీను నిర్వహించారు. కాగా అజయ్‌ జడేజా సారథ్యంలో ఈ క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. ఈ చారిత్రాత్మక టోర్నమెంట్ జూలై 29న బర్మింగ్‌హామ్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఎనిమిది జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఏడు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుంది. ఈ టోర్నీలో మ్యాచ్‌లు అన్నీ బర్మింగ్‌హామ్‌ వేదికగానే జరగనున్నాయి. ఇక కామన్వెల్త్ గేమ్స్‌ క్రికెట్‌ లో గోల్డ్ మెడల్ రేసులో మూడు జట్లను ఫేవరెట్స్ గా చెప్పొచ్చు. మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా తమ ఆధిపత్యం కొనసాగిస్తోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించే ఫేవరట్‌ జట్లలో ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మహిళల టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన రికార్డు ఉండడమే దీనికి కారణం. ఇప్పటి వరకు జరిగిన ఏడు టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో ఐదు టైటిల్స్‌ను లానింగ్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. బ్యాటింగ్‌ బౌలింగ్‌ పరంగానే కాదు బౌలింగ్ లోనూ ఆస్ట్రేలియా అత్యంత పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో బ్రెత్‌ మూనీ, కెప్టెన్‌ లానింగ్‌, మెక్‌గ్రాత్‌ వంటి స్టార్‌ క్రికెటర్‌లు ఉన్నారు. ఇక బౌలింగ్‌లో మేఘనా స్కాట్‌, జానెసన్‌ వంటి సీనియర్‌ బౌలర్లు ఉన్నారు. టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇచ్చే జట్లులో ఇంగ్లండ్‌ ఒకటి. అయితే ఈ లీగ్‌లో రెండు జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నప్పటికీ.. ఫైనల్లో మాత్రం ఈ రెండు జట్లు ఢీకోనే అవకాశం ఉంది. మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022 ఫైనల్లోను ఇంగ్లండ్‌, ఆసీస్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఆసీస్‌ విజయం సాధించి వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకుంది. అయితే కామన్వెల్త్ గేమ్స్‌లో ఇంగ్లండ్‌ రెగ్యూలర్‌ కెప్టెన్‌ హీథర్ నైట్ అందుబాటుపై సంద్ఘిదం నెలకొంది. ఒక వేళ ఈ టోర్నీకి ఆమె దూరమైతే ఇంగ్లండ్‌కు గట్టి ఎదరుదెబ్బగానే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే గోల్డ్‌ మెడల్‌ రేసులో ఉన్న మరో జట్టు భారత్‌. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి మేటి జట్లకు భారత్‌ నుంచి గట్టీ పోటీ ఎదురుకానుంది. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పెద్దగా ఆకట్టుకోకున్నా కామన్వెల్త్ గేమ్స్‌లో మాత్రం తమ సత్తా చాటాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది. భారత్‌ కూడా బ్యాటింగ్‌,బౌలింగ్‌ పరంగా పటిష్టం‍గా ఉంది. ఓపెనింగ్‌ జోడీ షఫాలీ వర్మ,స్మృతి మంధాన చేలరేగితే ప్రత్యర్ధి జట్టుకు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్‌లో రాధా యాదవ్‌, రాజేశ్వరీ గైక్వాడ్‌ వంటి అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా తో తలపడనున్న భారత్…తర్వాతి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఢీకొనబోతోంది.