Champions Trophy Teaser: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీజ‌ర్ విడుద‌ల‌.. పాండ్యా ఎంట్రీ సూప‌ర్‌!

Champions Trophy Teaser: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy Teaser) ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. టోర్నీలో తొలి మ్యాచ్ ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఇప్పుడు ఈ టోర్నీకి సంబంధించిన చిన్న టీజర్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఇందులో 5 మంది ఆటగాళ్లు కనిపిస్తున్నారు. అయితే ఈ టీజర్‌లో రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ కాకుండా భారతదేశానికి చెందిన మరో […]

Published By: HashtagU Telugu Desk
Pakistan Refunds

Pakistan Refunds

Champions Trophy Teaser: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy Teaser) ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. టోర్నీలో తొలి మ్యాచ్ ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఇప్పుడు ఈ టోర్నీకి సంబంధించిన చిన్న టీజర్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఇందులో 5 మంది ఆటగాళ్లు కనిపిస్తున్నారు. అయితే ఈ టీజర్‌లో రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ కాకుండా భారతదేశానికి చెందిన మరో ఆటగాడు కనిపించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ టీజర్ విడుదలైంది

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఈసారి 8 జట్లు పాల్గొంటున్నాయి. దీనికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్లు షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్‌లను ముందుగా చూపించారు. ఈ టీజర్‌లో టోర్నమెంట్ ట్రోఫీని ఓ భవనంలో చూపించారు. టీజర్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని కాకుండా హార్దిక్ పాండ్యాను చూపించారు. దీంతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మహ్మద్ నబీలను కూడా టీజర్‌లో చూపించారు. ఈ ఆటగాళ్లందరూ ట్రోఫీని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు టీజర్‌లో కనిపిస్తోంది.

Also Read: Wipro Expansion In Hyderabad: హైదరాబాద్‌లో విప్రో విస్తరణ.. 5000 మందికి ఉద్యోగాలు!

8 ఏళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ వస్తోంది

8 ఏళ్ల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. దీనికి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నమెంట్ కోసం టీమ్ ఇండియా పాకిస్థాన్‌లో పర్యటించటంలేదు. బదులుగా టీమ్ ఇండియా మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్‌లో ఆడ‌నుంది. చివరిసారిగా 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరిగింది. ఫైనల్‌లో పాక్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

మరోసారి టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ సిద్ధమయ్యాడు. ఫిబ్రవరి 20 నుంచి ఈ టోర్నీలో టీమిండియా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. టీమ్ ఇండియా తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరగనుంది. ఆ త‌ర్వాత‌ ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో టీమిండియా రెండో మ్యాచ్‌ ఆడనుంది.

  Last Updated: 23 Jan 2025, 10:59 AM IST