Site icon HashtagU Telugu

Virat Kohli: టీమిండియాకు బిగ్ షాక్, ఇంగ్లాండ్ తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం

Virat Kohli

Virat Kohli

Virat Kohli: ఇంగ్లండ్ తో ఈనెల 25నుంచి మొదలయ్యే ఐదు టెస్టుల సీరీస్ లో మొదటి రెండు టెస్టులకూ టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. వ్యక్తిగత కారణాల వల్ల తాను మొదటి రెండు టెస్టులూ ఆడలేనని కోహ్లీ బిసిసిఐకి సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారాన్ని బిసిసిఐ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా, హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఆదివారం ప్రాక్టీస్ లో పాల్గొన్నారు.

ఇక జనవరి 22న రామాలయ ప్రతిష్ఠాపనకు ఆహ్వానించబడిన 2000 మందిలో విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ ఉన్నారు. ముంబై విమానాశ్రయంలో విరాట్ కోహ్లీ కనిపించడంతో ఊహాగానాలు వచ్చాయి. అయితే వ్యక్తిగత కారణాలతో సిరీస్‌లోని మొదటి రెండు టెస్టు మ్యాచ్‌ల నుంచి బ్యాట్స్‌మెన్ వైదొలిగినట్లు బీసీసీఐ ప్రకటించింది. హైదరాబాద్, విశాఖపట్నంలలో జరగాల్సిన మొదటి రెండు టెస్టులను కోహ్లీ ఆడటం లేదని తెలిపింది. ఇక ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కూడా ఈ టెస్ట్ సీరీస్ లో ఆడటం లేదు. బ్రూక్ కూడా వ్యక్తిగత కారణాల వల్లే ఈ సీరీస్ లో ఆడలేకపోతున్నట్లు పేర్కొన్నాడు

భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య వచ్చే సిరీస్‌ జనవరి 25న హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత విశాఖపట్నం (ఫిబ్రవరి 2-6), రాజ్‌కోట్ (ఫిబ్రవరి 15-19), రాంచీ (ఫిబ్రవరి 23-27), ధర్మశాల (మార్చి 7-11)లో ఇతర మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే కోహ్లీ భార్య ప్రెగ్నెన్సీతో ఉందని, అందుకే రెండు టెస్టులకు దూరంగా ఉంటున్నాడని నెటిజన్స్ అభిప్రాయం.  అనుష్క శర్మ, కోహ్లీ కలిసి తమ రెండవ బిడ్డను ఆశిస్తున్నారని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.  అయితే ఈ జంట ఈ వార్తలను అధికారికంగా ధృవీకరించలేదు లేదా ఖండించలేదు.