BCCI: టీమిండియా 2026-27 షెడ్యూల్‌ విడుదల

BCCI Releases Team India’s 2026-27 Schedule  భారత క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త అందించింది. 2026-27 సీజన్‌కు సంబంధించి టీమిండియా స్వదేశంలో ఆడనున్న అంతర్జాతీయ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది. ఈ సీజన్‌లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 17 నగరాల్లో 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ షెడ్యూల్‌లో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అక్టోబర్ 2024 తర్వాత తొలిసారిగా […]

Published By: HashtagU Telugu Desk
BCCI Releases Team India 2026-27 Schedule

BCCI Releases Team India 2026-27 Schedule

BCCI Releases Team India’s 2026-27 Schedule  భారత క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుభవార్త అందించింది. 2026-27 సీజన్‌కు సంబంధించి టీమిండియా స్వదేశంలో ఆడనున్న అంతర్జాతీయ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది. ఈ సీజన్‌లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 17 నగరాల్లో 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ షెడ్యూల్‌లో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అక్టోబర్ 2024 తర్వాత తొలిసారిగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే, ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గౌహతిలోని బర్సపరా స్టేడియం మొదటిసారి ఒక టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించనుంది.

షెడ్యూల్ వివరాల్లోకి వెళ్తే, ఈ హోమ్ సీజన్ వెస్టిండీస్ పర్యటనతో ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు జరిగే ఈ టూర్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఉంటాయి. వన్డేలకు త్రివేండ్రం, గౌహతి, న్యూ చండీగఢ్ ఆతిథ్యం ఇస్తుండగా, లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరు నగరాలు టీ20 మ్యాచ్‌లకు వేదికలుగా నిలవనున్నాయి.

ఆ తర్వాత, డిసెంబర్‌లో శ్రీలంక జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. డిసెంబర్ 13 నుంచి 27 వరకు జరిగే ఈ సిరీస్‌లో మూడు వన్డేలు, మూడు టీ20లు ఉంటాయి. వన్డేలు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్‌లలో జరగనుండగా, రాజ్‌కోట్, కటక్, పుణేలలో టీ20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

కొత్త ఏడాది ఆరంభంలో, జనవరి 3 నుంచి 9 వరకు జింబాబ్వే జట్టు భారత్‌లో పర్యటించి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దీంతో హైదరాబాద్ నగరానికి ఈ సీజన్‌లో రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు దక్కినట్టయింది.

ఈ సీజన్‌కు ప్రధాన ఆకర్షణగా, అభిమానులు ఎంతగానో ఎదురుచూసే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నిలవనుంది. జనవరి 21 నుంచి మార్చి 3 వరకు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌ జరగనుంది. నాగ్‌పూర్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుండగా, ఆ తర్వాత చెన్నై, గౌహతి, రాంచీ, అహ్మదాబాద్‌లలో మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రపంచంలోని రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య జరిగే ఈ సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సుదీర్ఘ షెడ్యూల్ దేశంలోని క్రికెట్ అభిమానులకు అసలైన పండగను తీసుకురానుంది.

  Last Updated: 26 Mar 2026, 04:07 PM IST