Asian Games: ఆసియా క్రీడల కోసం భారత పురుషుల, మహిళల జట్టును ప్రకటించిన బీసీసీఐ.. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్..!

సెప్టెంబర్‌లో జరగనున్న 19వ ఆసియా క్రీడల (Asian Games)కు 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టు పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
Asian Games

Resizeimagesize (1280 X 720)

Asian Games: సెప్టెంబర్‌లో జరగనున్న 19వ ఆసియా క్రీడల (Asian Games)కు 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టు పేరును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించింది. ఈ జట్టుకు యువ ఆటగాడు రితురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అదే సమయంలో ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్‌లలో నిలకడగా ప్రదర్శన కనబరిచిన పలువురు యువ ఆటగాళ్లు రింకూ సింగ్‌తో సహా జట్టులోకి వచ్చారు.

ఆసియా క్రీడల్లో క్రికెట్ ఈవెంట్‌లు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు టీ20 ఫార్మాట్‌లో జరుగుతాయి. అక్టోబర్ 5 నుంచి భారత్‌లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ టోర్నీకి యువ ఆటగాళ్ల బృందాన్ని పంపుతున్నారు. ఈ జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్ కూడా జట్టులో ఉన్నారు.

అలాగే.. 19వ ఆసియా క్రీడల కోసం 15 మంది సభ్యులతో కూడిన మహిళా జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. సెప్టెంబర్‌లో జరగనున్న ఈ టోర్నీలో భారత మహిళల జట్టు కెప్టెన్సీని హర్మన్‌ప్రీత్ కౌర్‌కు అప్పగించారు. దీంతో పాటు స్మృతి మంధాన జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది. తాజాగా బంగ్లాదేశ్‌లో పర్యటించిన భారత మహిళల జట్టు టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

చైనాలోని హాంగ్‌జౌలో సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు క్రికెట్ ఈవెంట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఆసియా క్రీడలకు పురుషుల, మహిళల జట్లను పంపుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మహిళల జట్టులో ప్రధాన క్రీడాకారిణులందరూ ఆడటం కనిపిస్తుంది. అదే సమయంలో పురుషుల బృందాన్ని పంపాలని కూడా బీసీసీఐ అధికారులు నిర్ణయించారు.

2022లో ఇంగ్లండ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఆడేందుకు మహిళల జట్టు వెళ్లినప్పుడు రజత పతకాన్ని సాధించింది. ఆసియా క్రీడల్లో మూడోసారి క్రికెట్‌ను చేర్చారు. ఈసారి టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇంతకుముందు, క్రికెట్ ఈవెంట్ 2010, 2014 ఆసియా క్రీడలలో చేర్చబడింది. ఆ సమయంలో బీసీసీఐ పురుషుల, మహిళల జట్లను పంపలేదు.

Also Read: India Win: మూడు రోజుల్లేనే ముగించేశారు.. తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం..!

ఆసియా క్రీడల కోసం భారత పురుషుల జట్టు

రితురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (WK), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, శివం మావి, శివమ్ దూబే, ప్రభసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).

స్టాండ్‌బై ఆటగాళ్లు: యశ్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.

ఆసియా క్రీడల కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (WK), అమంజోత్ కౌర్, దేవిక వైద్య, అంజలి సర్వాణి, టిటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్, మిను మణి, కనికా అహుజా, అనుషా.

స్టాండ్ బై ప్లేయర్స్: హర్లీన్ డియోల్, కశ్వీ గౌతమ్, స్నేహ రాణా, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్.

  Last Updated: 15 Jul 2023, 07:12 AM IST