Team India: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు కొత్త జెర్సీలు.. టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్ గా జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్..!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు (Team India) కొత్త కిట్ స్పాన్సర్‌ను BCCI ప్రకటించింది. భారత జట్టు (Team India)కు కొత్త కిట్ స్పాన్సర్‌గా జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ పేరును ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - May 23, 2023 / 12:04 PM IST

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు (Team India) కొత్త కిట్ స్పాన్సర్‌ను BCCI ప్రకటించింది. భారత జట్టు (Team India)కు కొత్త కిట్ స్పాన్సర్‌గా జర్మన్ స్పోర్ట్స్ బ్రాండ్ అడిడాస్ పేరును ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) సెక్రటరీ జై షా మే 22 న ఈ సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం, భారత జట్టు కిట్ స్పాన్సర్ కిల్లర్ జీన్స్ కాంట్రాక్ట్ మే 31తో ముగుస్తుంది. దీని తర్వాత WTC ఫైనల్ మ్యాచ్ నుండి భారత జట్టు జెర్సీపై అడిడాస్ లోగో కనిపిస్తుంది. ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఆడాల్సి ఉంది.

కిల్లర్ జీన్స్ కొద్ది కాలం పాటు భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా సంతకం చేశారు. కిల్లర్ కంటే ముందు MPL భారత జట్టుకు కిట్ స్పాన్సర్‌గా ఉండేది. అడిడాస్ పేరును ప్రకటించడంతో పాటు బీసీసీఐ కార్యదర్శి కూడా సంతోషం వ్యక్తం చేశారు. భారత జట్టు తదుపరి కిట్ స్పాన్సర్‌గా అడిడాస్‌తో బీసీసీఐ జతకట్టిందని తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము అని జై షా తన ట్వీట్‌లో రాశారు. క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ వేర్ కంపెనీతో జతకట్టడం మాకు ఆనందంగా ఉందని ఆ ట్వీట్ పేర్కొన్నారు.

Also Read: Virat Kohli: కోహ్లీ జట్టు మారాల్సిన సమయం వచ్చింది.. ఢిల్లీ జట్టుకు మారిపో అంటూ పీటర్సన్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫైర్..!

భారత జట్టు కిట్ స్పాన్సర్‌గా MPL 2023 సంవత్సరం చివరి వరకు BCCIతో జతకట్టింది. అయితే ఈ ఒప్పందాన్ని మధ్యలోనే ముగించాలని నిర్ణయించుకుంది. దీని తర్వాత BCCI కిల్లర్ జీన్స్‌తో కిట్ స్పాన్సర్‌గా కేవలం 5 నెలలు మాత్రమే జతకట్టింది. ఇప్పటి వరకు అడిడాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయంపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో ఒక్కో మ్యాచ్‌కు 65 లక్షల రూపాయల చొప్పున భారత బోర్డుకు MPL చెల్లించేది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో టీమ్ ఇండియా అడిడాస్ లోగోతో కూడిన కొత్త జెర్సీని ధరించవచ్చు. జూన్ 7న ఇంగ్లండ్‌లోని లార్డ్స్ స్టేడియంలో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సర్వం సిద్ధం చేసుకుంది.