Site icon HashtagU Telugu

Virat Kohli Fans: విరాట్ కోహ్లీ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌.. ఎందుకంటే?

Virat Kohli Fans

Virat Kohli Fans

Virat Kohli Fans: 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విరాట్ కోహ్లీ ఎట్టకేలకు రంజీ ట్రోఫీలో పునరాగమనం చేయబోతున్నాడు. జనవరి 30న అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్‌తో కోహ్లి (Virat Kohli Fans) రంగంలోకి దిగనున్నాడు. 2012 తర్వాత విరాట్ దేశవాళీ క్రికెట్‌లో కనిపించడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కోహ్లీ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్ ఉంది. అభిమానుల‌ను కోహ్లీని చూడలేరు.

ఎందుకంటే ఆన్‌లైన్‌లో ప్రసారం చేయబడే లిస్ట్‌లో ఢిల్లీ వ‌ర్సెస్ రైల్వేస్ మధ్య మ్యాచ్ చేర్చబడలేదు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రసారం కోసం ప్రతి రౌండ్‌లో మూడు మ్యాచ్‌లను నిర్ణయిస్తుంది. అందువల్ల ఈ మ్యాచ్‌ను టీవీలో చూపించకూడదని లేదా ఆన్‌లైన్‌లో ప్రసారం చేయకూడదని ఇప్పటికే నిర్ణ‌యం తీసుకుంది. ఈ కార‌ణంగా కోహ్లీ అభిమానుల‌ను మ్యాచ్‌ను లైవ్‌లో చూడ‌లేరు. అయితే త‌న అభిమాన ఆట‌గాడు 12 ఏళ్ల త‌ర్వాత రంజీలోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో అభిమానులు సైతం దేశ‌వాళీ క్రికెట్‌లో కోహ్లీ ఆట‌తీరు ఎలా ఉంటుందా? అని చూడాల‌నుకుంటున్నారు. కానీ బీసీసీఐ నిర్ణ‌యంతో అభిమానుల‌కు నిరాశ ఎదురైంది.

Also Read: Deep Seek AI : అమెరికాకు చైనా ‘డీప్ సీక్’ కలవరం.. డౌన్‌లోడ్లలో నంబర్ 1.. ఎలా ?

ఈ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది

గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ రౌండ్‌లో బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక, హర్యానా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్ రెండూ జరుగుతాయి. స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ఆటతీరుతో ఈ మ్యాచ్ ప్రపంచమంతా ప్ర‌సారం కానుంది. దీంతో పాటు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్‌తో బెంగాల్ హోమ్ మ్యాచ్, వడోదరలోని కోటంబి స్టేడియంలో బరోడా, జమ్మూ కాశ్మీర్ మధ్య మ్యాచ్ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయ‌నున్నారు.

ఢిల్లీకి క్వాలిఫై అయ్యే అవకాశాలు తక్కువ

గ్రూప్ డిలో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీకి నాకౌట్‌కు అర్హత సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీరి కంటే ముందు రైల్వేస్ 17 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. తమిళనాడు (25), చండీగఢ్ (19), సౌరాష్ట్ర (18) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయని మ‌న‌కు తెలిసిందే.

Exit mobile version