Site icon HashtagU Telugu

Gabba Stadium: గబ్బా స్టేడియం కూల్చివేత‌.. కార‌ణం పెద్ద‌దే!

Gabba Stadium

Gabba Stadium

Gabba Stadium: బ్రిస్బేన్‌లోని చారిత్రాత్మక గబ్బా స్టేడియంకు (Gabba Stadium) సంబంధించి ఓ పెద్ద వార్త బయటకు వస్తోంది. 2032 ఒలింపిక్స్, పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్‌లోని గబ్బా స్టేడియం కూల్చివేయనున్న‌ట్లు తెలుస్తోంఇ. గబ్బా చాలా సంవత్సరాలుగా క్రికెట్, AFL (ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్ లీగ్)కి ప్రధాన వేదికగా ఉంది. ఈ మైదానంలో ఇప్పటి వరకు ఎన్నో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు జరిగాయి. ఇప్పుడు క్వీన్స్‌లాండ్ ప్రభుత్వం బ్రిస్బేన్‌లోని విక్టోరియా పార్క్‌లో దాదాపు 63,000 మంది సామర్థ్యం కలిగి ఉండే కొత్త, అత్యాధునిక స్టేడియంతో గబ్బాను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త స్టేడియం రాబోయే కాలంలో పెద్ద టోర్నమెంట్‌లకు కూడా ఆతిథ్యం ఇవ్వనుంది.

సంవత్సరాలుగా గ‌బ్బా దాని పాత నిర్మాణం, పరిమిత సౌకర్యాల కారణంగా అనేక సమస్యలను ఎదుర్కొంది. 2021 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1988 తర్వాత తొలిసారిగా ఆస్ట్రేలియాను భారత్ ఓడించిన మైదానం ఇదే. ఆ మ్యాచ్‌లో ఛెతేశ్వర్‌ పుజారా, రిషబ్‌ పంత్‌ భారత్‌ తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ మైదానాన్ని ఆస్ట్రేలియా కోట అని పిలుస్తారు. ఇక్కడ ఆస్ట్రేలియాను ఓడించడం ఏ జట్టుకైనా చాలా కష్టం. ఈ మైదానంలో ఇప్పటి వరకు అనేక చారిత్రాత్మక మ్యాచ్‌లు ఆడబడ్డాయి. అయితే ఆధునిక అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే ఇకపై ఏ మ్యాచ్‌ను నిర్వహించేందుకు అనువుగా పరిగణించబడదు. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం దానిని తొలగించి కొత్త స్టేడియంను నిర్మించాలని నిర్ణయించింది. ఇది క్వీన్స్‌లాండ్ క్రీడా సంఘానికి మెరుగైన, ఆధునిక సౌకర్యాన్ని అందిస్తుంది.

Also Read: Health Tips: టాయిలెట్ లో ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఈ సమస్యలు రావడం ఖాయం!

3.8 బిలియన్ డాలర్ల వ్యయంతో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు

కొత్త స్టేడియం అంచనా వ్యయం సుమారు 3.8 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు. ఇది క్రికెట్, AFL, ఇతర అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి రూపొందించబడుతుందని చెప్పబడింది. క్రికెట్ ఆస్ట్రేలియా, క్వీన్స్‌లాండ్ క్రికెట్ ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చాయి. ఎందుకంటే కొత్త స్టేడియం నిర్మాణం తర్వాత ICC టోర్నమెంట్‌లు, బిగ్ బాష్ లీగ్ వంటి టోర్నమెంట్‌లు అక్కడ నిర్వహించబడతాయి. క్వీన్స్‌లాండ్ ప్రీమియర్ డేవిడ్ క్రిసాఫుల్లి మంగళవారం ఈ ప్రకటన చేశారు. ఈ కొత్త స్టేడియం క్రికెట్, ఇతర క్రీడలకు గొప్ప వేదికగా మారుతుందని అన్నారు.

గబ్బా 1931 నుండి టెస్ట్ క్రికెట్‌ను నిర్వహిస్తోంది. ఇక్కడ అనేక చారిత్రాత్మక మ్యాచ్‌లు ఆడబడ్డాయి. ఈ మైదానంలో మొదటి టెస్ట్ 1931లో జరిగింది. ఇప్పటివరకు ఈ వేదికపై 67 పురుషుల మ్యాచ్‌లు ఆడబడ్డాయి. రెండు టెస్ట్ మ్యాచ్‌లతో పాటు మహిళల జట్టు కూడా ఆడింది. BGT సమయంలో ఆస్ట్రేలియాతో ఈ మైదానంలో భారత్ తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడింది. సిరీస్‌లో ఇది మూడో టెస్టు డ్రాగా ముగిసింది.