Site icon HashtagU Telugu

India XI vs UAE: ఆసియా కప్ 2025.. నేడు యూఏఈతో టీమిండియా మ్యాచ్‌, ప్లేయింగ్ 11 ఇదేనా?

India XI vs UAE

India XI vs UAE

India XI vs UAE: ఆసియా కప్ 2025లో టీమిండియా గెలవడానికి బలమైన పోటీదారుగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో మెన్ ఇన్ బ్లూ జట్టు ఈరోజు యూఏఈతో (India XI vs UAE) తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరగనుంది. మ్యాచ్‌కి ముందు కెప్టెన్ సూర్య ఏ 11 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగుతారన్నది పెద్ద ప్రశ్న. అంటే ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో తాను యూఏఈతో తొలి మ్యాచ్‌లో ఆడించాలనుకుంటున్న జట్టును వెల్లడించారు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఒక ఆటగాడు అతని ప్లేయింగ్ 11లో లేడు.

యూఏఈతో జరిగే మ్యాచ్‌ కోసం టీమ్ ఇండియా ప్లేయింగ్ 11ను ఎంపిక చేస్తూ అశ్విన్ ఓపెనింగ్ జోడీగా శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఉంటారని అన్నారు. ఈ కాంబినేషన్ ఏ బౌలర్‌కైనా తలనొప్పిగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక వైపు అభిషేక్ శర్మ దూకుడుగా ఆడతాడని, మరోవైపు శుభ్‌మన్ గిల్ జట్టుకు బలమైన పునాది వేయగలడని అశ్విన్ నమ్ముతున్నారు.

మిడిల్ ఆర్డర్‌లో వీరికే చోటు

అశ్విన్, గిల్‌ను రన్ మెషీన్‌గా అభివర్ణిస్తూ.. “శుభ్‌మన్ గిల్‌కు రన్స్ ఎలా చేయాలో తెలుసు. కొంచెం తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడినా ఎక్కువ పరుగులు చేయగలడు. అతనికి 55 బంతుల్లో సెంచరీ కొట్టే సామర్థ్యం ఉంది” అని అన్నారు. అశ్విన్ మూడవ, నాలుగవ స్థానాల్లో వరుసగా సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలను ఎంపిక చేశారు. సూర్య అనుభవం, తిలక్ ధైర్యమైన బ్యాటింగ్‌లు భారత్‌కు వెన్నెముకగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

Also Read: ISIS Terrorists : రాంచీలో ఇద్దరు ISIS అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్

సంజూకు బదులు జితేశ్‌కు ఎందుకు అవకాశం ఇచ్చారు?

ఆర్. అశ్విన్ సంజూ శాంసన్‌ను జట్టు నుండి తప్పించారు. దీనికి గల కారణాన్ని కూడా వివరించారు. ఓపెనింగ్‌లో సంజూకు చోటు దక్కదని, ఫినిషర్‌గా అతను సరిపోడని అశ్విన్ భావించారు. అందుకే వికెట్ కీపర్-ఫినిషర్ పాత్ర కోసం సంజూ కంటే ముందుగా జితేశ్ శర్మకు అవకాశం ఇచ్చారు. మిడిల్ ఆర్డర్‌లో జితేశ్ మెరుపు బ్యాటింగ్ టీమ్ ఇండియాకు కీలక అస్త్రం అవుతుందని అశ్విన్ నమ్మారు.

బౌలింగ్ కోసం 6 ఎంపికలు

అశ్విన్ ముగ్గురు స్పిన్నర్లను (అక్షర్, వరుణ్, కుల్దీప్) ఎంపిక చేశారు. అలాగే పేస్ బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలను ఎంపిక చేసుకున్నారు. అంటే మొత్తం ఆరు బౌలింగ్ ఎంపికలు ఉన్నాయన్నమాట. ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యాను ఉంచారు. అతను బంతి, బ్యాటు రెండింటితోనూ మ్యాచ్ గమనాన్ని మార్చగలడు. ఏడవ స్థానంలో అక్షర్ పటేల్ ఉన్నాడు. అవసరమైనప్పుడు బంతితో, బ్యాటుతో ఉపయోగపడగలడు. ఎనిమిదవ స్థానంలో వరుణ్ చక్రవర్తి, తొమ్మిదవ స్థానంలో కుల్దీప్ యాదవ్, పదవ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్, 11వ స్థానంలో బుమ్రా ఉన్నారు.

అశ్విన్ ఎంపిక చేసిన భారత ప్లేయింగ్ 11